బొమ్మలతో మురిపించి.. అక్షరాలతో మెరిపించి..
చేతి వేళ్లతో అందమైన బొమ్మలు వేస్తూ వివిధ పోటీల్లో పాల్గొంటూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు చిన్నారులు. పిల్లలు తమ ఆలోచనలకు పదును పెడుతూ రకరకాల బొమ్మలు వేస్తూ నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటున్నారు. రంగు రంగుల పెన్సిళ్లు,
● జాతీయస్థాయిలో ప్రతిభ చాటిన చిన్నారులు
నల్గొండ విద్యావిభాగం, న్యూస్టుడే: చేతి వేళ్లతో అందమైన బొమ్మలు వేస్తూ వివిధ పోటీల్లో పాల్గొంటూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు చిన్నారులు. పిల్లలు తమ ఆలోచనలకు పదును పెడుతూ రకరకాల బొమ్మలు వేస్తూ నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటున్నారు. రంగు రంగుల పెన్సిళ్లు, పెయింటింగ్లతో అందంగా చిత్రాలు గీస్తూ ప్రతిభను చాటుతున్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన కళాభారతి ఛైల్డ్ ఆర్ట్స్ ఇనిస్టిట్యూట్ పాఠశాల విద్యార్థులకు జాతీయస్థాయిలో చిత్రలేఖనం, హ్యాడ్రైటింగ్ పోటీలు ఇటీవల నిర్వహించింది. పాఠశాలలో ఉపాధ్యాయుల సమక్షంలోనే చిత్రాలు గీసి వాటిని పోస్టు ద్వారా పంపించారు. ఈ పోటీల్లో నల్గొండలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు మోక్షశ్రీ(1వ తరగతి), కె.కృష్ణతేజ(5వ) శివాంజలి(7వ) మహేజబీన్(9వ)లు చిత్రలేఖనంలో, సాయి విగ్నేష్(3వ), సీహెచ్.సోమార్చన(5వ), కె.అక్షయ(7వ) తరగతి విద్యార్థులు చేతిరాతలో ప్రతిభను చాటి కళాభారతి అవార్డుకు ఎంపికయ్యారు.
అవార్డు రావడం ఆనందంగా ఉంది
-మాహిజబీన్, 9వ తరగతి
చిత్రాలు గీయడం, పెయింటింగ్ వేయడంలో దిట్ట. తనకు జాతీయస్థాయిలో కళాభారతి అవార్డు రావడం పట్ల సంతోషంగా ఉంది. చదువుతో పాటు వివిధ కళల్లో నైపుణ్యాన్ని పెంచుకున్న. పాఠశాల స్థాయిలో నిర్వహించిన మెహెందీ డిజైన్ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచాను. ఇప్పటికే ఎన్నో బహుమతులు అందుకున్నా.
మైక్రో ఆర్ట్పై మక్కువ
-ఎం.శ్రీహిత, 3వ తరగతి
చిత్రలేఖనం మీద ఆసక్తితో బొమ్మలు గీయడం, రంగులు వేయడం వంటి చిత్రాలు గీస్తున్న. తాను మైక్రో ఆర్ట్ మీద ఎక్కువ ఆసక్తి పెంచుకున్నా. ఇటీవల మహారాష్ట్రలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో మూడవ తరగతి విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచా. బొమ్మలు వేయడమే కాకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలో అక్షరాలు అందంగా రాస్తా. ఇంగ్లీష్లో ప్రింటింగ్ లెటర్లు, లుసిడా హ్యాడ్ రైటింగ్, కర్స్యూ హ్యాడ్ రైటింగ్ అవలీలలుగా రాస్తాను. తనకు అవార్డు రావడం సంతోషంగా ఉంది. తన నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటూ మరిన్ని అవార్డులు సాధిస్తా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.