logo

అప్పుల బాధతో ఆభరణాల వ్యాపారి బలవన్మరణం

అప్పుల బాధతో ఆభరణాల వ్యాపారి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నల్గొండ జిల్లా నకిరేకల్‌లో చోటు చేసుకుంది. సీఐ కె.నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రకు

Updated : 18 Jan 2022 02:41 IST

అభిషేక్‌

నకిరేకల్‌, న్యూస్‌టుడే: అప్పుల బాధతో ఆభరణాల వ్యాపారి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నల్గొండ జిల్లా నకిరేకల్‌లో చోటు చేసుకుంది. సీఐ కె.నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రకు చెందిన అభిషేక్‌(24) కొన్ని సంవత్సరాలుగా తన తండ్రి, సోదరునితో కలిసి నకిరేకల్‌లో ఆభరణాల వ్యాపారం చేస్తున్నారు. కాగా వ్యాపార నిమిత్తం చేసిన అప్పుల బాధ తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో సైనెడ్‌ తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని