పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
పదోతరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 23 నుంచి జూన్ 1వ తేది వరకు జరగనున్న పరీక్షలకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. రెండేళ్లుగా కరోనాతో పరీక్షలు
‘న్యూస్టుడే’తో డీఈవో బి.భిక్షపతి
నల్గొండ విద్యావిభాగం, న్యూస్టుడే: పదోతరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 23 నుంచి జూన్ 1వ తేది వరకు జరగనున్న పరీక్షలకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. రెండేళ్లుగా కరోనాతో పరీక్షలు నిర్వహించలేకపోయారు. ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు రావడం, దానిలో ప్రమేయం ఉన్న ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై కేసుల నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అప్రమత్తమైంది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, అక్రమాలకు ఆస్కారం ఇవ్వొద్దని డీఈవో బి.భిక్షపతి సీఎస్లను ఆదేశించారు. ఏపీలో జరిగిన సంఘటన నేపథ్యంలో అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ముందు పశ్నాపత్రాలు తెరిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి పరీక్షలను ఆరు పేపర్లకు కుదించడం, సీసీ కెమెరాల వినియోగించడం వంటి కొత్త అంశాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ డీఈవోతో ముఖాముఖి నిర్వహించింది. వివరాలు ఆయన మాటల్లోనే.
* నల్గొండ జిల్లాలో 19,910 మంది రెగ్యులర్, 8 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రెగ్యులర్ వారిలో బాలురు 10,360, బాలికలు 9050 మంది, ప్రైవేట్ విద్యార్థుల్లో బాలురు 4, బాలికలు 4 మంది ఉన్నారు. మొత్తం 107 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం.
* అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని ఉన్నతాధికారులు ఆదేశించారు. సీఎస్కు కేటాయించిన గదిలో సీసీ కెమెరా ఏర్పాటు తప్పనిసరి. పోలీసుస్టేషన్ నుంచి పరీక్ష కేంద్రానికి ప్రశ్నాపత్రం, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ వచ్చాయి. వాటిని సీసీ కెమెరా ముందు తెరవాల్సి ఉంటుంది. సీసీ కెమెరా ఆన్ చేశాక పరీక్ష ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆన్లోనే ఉండాలి. ప్రశ్నాపత్రాలు తెరిచిన సమయాన్ని సీఎస్లు రికార్డు చేయాలి. ప్రస్తుతానికి 16 కేంద్రాల్లోనే సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. 31 ప్రైవేట్ పరీక్ష కేంద్రాల్లో ఆయా యాజమాన్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ యాజమాన్యం కింద ఉన్న 60 కేంద్రాల్లో సీసీ కెమెరాలు కొత్తగా ఏర్పాటు చేస్తాం. పరీక్షలు నిర్వహించే అధికారులు, ఇన్విజిలేటర్లు సహ ఎవరికి కూడా సెల్ఫోన్లకు అనుమతి లేదు.
* పరీక్ష కేంద్రాల చుట్టు పక్కన ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసివేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రయివేట్ పరీక్ష కేంద్రాల్లో జిరాక్స్ యంత్రాలు ఉంటాయి. వాటిని పరీక్షలు ముగిసే వరకు అక్కడి నుంచి వేరే చోటుకి తరలించేలా చూస్తాం.
* పరీక్ష కేంద్రంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతున్నాం. తగిన ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నాం. కరెంట్, ఫ్యాన్ ఉన్న తరగతి గదుల్లో పిల్లలు పరీక్ష రాస్తారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని మంచి నీటి సౌకర్యం, వైద్యారోగ్య సిబ్బంది సేవలు అందుబాటులో ఉంటాయి. పోలీసు బందోబస్త్ నిర్వహిస్తారు.
* అన్ని మండలాల్లో సంబంధిత ఎంఈవోల చరవాణి నెంబర్ హెల్ప్లైన్ నెంబర్గా ఉంటుంది. జిల్లా స్థాయిలో డీఈవో నెంబర్ 98499 09123కు సమాచారం ఇవ్వొచ్ఛు పరీక్షల సహాయక కమిషనర్ చరవాణి 79898 19053 హెల్ప్లైన్గా ఉంటాయి. ● 107 కేంద్రాలలో 107 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 107 డిపార్టుమెంటల్ అధికారులు, 1110 మంది ఇన్విజిలెటర్లు, ఆరుగురు ఫ్లైయింగ్ స్క్వాడ్స్ పరీక్షల విధుల్లో పాలుపంచుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.