logo

విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం

విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని వడపర్తి గ్రామంలో శనివారం చోటుచేసుకొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వడపర్తికి చెందిన బిచ్చాల

Published : 22 May 2022 04:40 IST

పోచమల్లు

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని వడపర్తి గ్రామంలో శనివారం చోటుచేసుకొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వడపర్తికి చెందిన బిచ్చాల రామచంద్రం, అనసూయ దంపతుల ఏకైక కుమారుడు పోచమల్లు(19) ప్రైవేటుగా కరెంటు పని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నారు. గ్రామంలో ఓ ఇంట్లో మరొకరితో కలిసి కరెంటు పని చేస్తున్న విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే భువనగిరి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఎస్సై రాఘవేందర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని