logo

తోటి పూజారిపై దాడి

మేళ్లచెరువు శివాలయంలో తోటి పూజారిపై ఆలయ పూజారి దాడికి పాల్పడిన ఘటన సోషల్‌ మీడియాలో శనివారం వైరల్‌గా మారింది. ఈ ఘటన ఈ నెల 23వ తేదీ సాయంత్రం చోటు చేసుకుంది. ఆరోజు శివాలయ ప్రధాన అర్చకుడు శివ విష్ణువర్ధన్‌ శర్మ

Published : 29 May 2022 06:03 IST

బాధ్యుడికి మెమో జారీ


తోటి పూజారి పై చేయి చేసుకుంటున్న అర్చకుడు ధనుంజయ శర్మ

మేళ్లచెరువు, న్యూస్‌టుడే: మేళ్లచెరువు శివాలయంలో తోటి పూజారిపై ఆలయ పూజారి దాడికి పాల్పడిన ఘటన సోషల్‌ మీడియాలో శనివారం వైరల్‌గా మారింది. ఈ ఘటన ఈ నెల 23వ తేదీ సాయంత్రం చోటు చేసుకుంది. ఆరోజు శివాలయ ప్రధాన అర్చకుడు శివ విష్ణువర్ధన్‌ శర్మ ఆదేశాల మేరకు నర్సింహ అనే తాత్కాలిక పూజారి వాహన పూజ నిర్వహించారు. దక్షిణ రూపేణ వచ్చిన డబ్బును తనకు ఇవ్వాలని అమ్మవారి ఆలయ జూనియర్‌ అర్చకుడు ధనుంజయ శర్మ అతన్ని గట్టిగా అడిగాడు. ఆ సందర్భంలో ప్రధాన పూజారిని అడిగి ఇస్తానని సమాధానం చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అతనిపై ధనుంజయ శర్మ చేయి చేసుకున్నాడు. అతను చెప్పేది వినకుండా చెంపలపై పదే పదే కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో శనివారం వైరలైంది. ధనుంజయ తనకు క్షమాపణ చెప్పాడని బాధితుడు నర్సింహ ఒక వీడియోలో పేర్కొన్నారు. దీనిపై ఈవో కొండారెడ్డిని వివరణ కోరగా.. ఆలయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం బాధాకాకరమని పేర్కొన్నారు. బాధ్యుడికి ఈనెల 24వ తేదీనే మెమో ఇచ్చామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని