ఖాళీ.. కష్టంగా మారి
విద్యుత్తు శాఖలో ఖాళీలు కంగారెత్తిస్తున్నాయి.ఏళ్లుగా ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడంతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
నల్గొండ పురపాలిక, న్యూస్టుడే
స్తంభంపై మరమ్మతులు చేస్తున్న సిబ్బంది
విద్యుత్తు శాఖలో ఖాళీలు కంగారెత్తిస్తున్నాయి.ఏళ్లుగా ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడంతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న విద్యుత్తు సర్వీసులకు అనుగణంగా కొత్త పోస్టులు మంజూరు చేయడంతో పాటు, ఉద్యోగ విరమణ పొందుతున్న వారి స్థానాలను భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడంతో.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖాళీ పోస్టుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై పని భారం పడుతోంది. దీంతో వినియోగదారులకు సక్రమంగా సేవలు అందకుండా పోతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 770 పోస్టుల ఖాళీ..
విద్యుత్తు సంస్థలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సిన జూనియర్ లైన్మెన్లు, లైన్మెన్ల పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో విద్యుత్తు సమస్యలు, సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు అన్నీ తామై చూసుకోవాల్సిన సిబ్బంది సంఖ్య రోజురోజుకు తగ్గిపోతున్నారు. సమస్యల పరిష్కారానికి గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సూర్యాపేట జిల్లాలో 870 మంజూరు పోస్టులు ఉండగా.. 220 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా ఏఈ-2, ఏఏవో-3, ఏడీఈ-3, జూనియర్ అసిస్టెంట్లు-25, అసిస్టెంటు లైన్మెన్లు- 83, జూనియర్ లైన్మెన్- 76, టైపిస్టు-4 ఖాళీగా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో మొత్తం 1357 పోస్టులు మంజూరు చేయగా.. 357 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో ఏఈ, ఏడీఈలు ఒక్కరు చొప్పున, సహాయ గణాంకాధికారులు 35, టైపిస్టులు-12, లైన్మెన్-13, అసిస్టెంట్ లైన్మెన్-138, జూనియర్ లైన్మెన్-119 ఖాళీగా కనిపిస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో 884 మంజూరు పోస్టులు ఉండగా.. 193 పోస్టులు ఖాళీలున్నాయి. వీటిల్లో జూనియర్ లైన్మెన్-27, అసిస్టెంటు లైన్మెన్- 119, జూనియర్ అసిస్టెంట్లు-18 చొప్పున ఖాళీలున్నాయి.
ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది
చంద్రమోహన్, ఎస్ఈ నల్గొండ జిల్లా
క్షేత్రస్థాయిలో ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవలే ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. మిగతా పోస్టుల వివరాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నాం. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సిబ్బంది అధికారుల సమన్వయంతో పని చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలెక్టరేట్లో రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా భువనగిరిలో సాధారణ పరిశీలకుడు రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనమంతు కే.జెండగే సమక్షంలో సమావేశం నిర్వహించారు. -
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..