కబ్జా కోరల్లో.. కాల్వ కట్టలు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు సంబంధించిన స్థలాల కబ్జా యథేచ్ఛగా సాగుతున్నా.. ఆ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.
నేరేడుచర్ల: ఫత్తేపురం ఆర్-8 లిఫ్టు సమీపంలో సాగర్ ఎడమకాల్వ
కట్ట స్థలంలో ఆక్రమణల పర్వం ఇలా
నేరేడుచర్ల, న్యూస్టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు సంబంధించిన స్థలాల కబ్జా యథేచ్ఛగా సాగుతున్నా.. ఆ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో ఫత్తేపురం ఆర్-8 ఎత్తిపోతల పథకం పక్కన ఎడమ కాల్వ కట్ట స్థలాన్ని చదును చేసి, మడులుగా మార్చి సాగర్ ఎడమ కాల్వకు పైప్లైన్లు వేసి సాగుకు సిద్ధం చేశారు. ప్రభుత్వం సాగర్ ప్రధాన కాల్వతో పాటు మేజర్లకు బౌండరీలు గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాలని గతేడాది నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించిన విషయం విదితమే. దీనికి సంబంధించి కొన్నిచోట్ల మార్కింగ్ సైతం ఇచ్చారు. ఒకరిని చూసి ఒకరు కాస్త వెడల్పుగా ఉన్న చోట ఆక్రమణలు జరిపి వరి సాగు చేపడుతున్నారు. ఎడమ కాల్వకు ఇరువైపులా కట్టలతో పాటు కొన్ని చోట్ల విశాలంగా స్థలాలు వదిలారు. ఆ స్థలాలను వినియోగించేవారు చాలా చోట్ల ఆక్రమించడంతో కట్టల పరిధి సైతం తగ్గిపోతోంది. కాల్వ కట్టల వెంట నిల్వ ఉంచిన ఎత్తయిన మట్టి గుట్టలు కాస్తా కనుమరుగై పోతుండటంతో భవిష్యత్తులో కాల్వ కట్టలకు గండ్ల ముప్పు పెరగనుంది.
ప్లాంట్ స్థలాలు ఆక్రమించేశారు..
ఇదే పంచాయతీ పరిధిలో సాగర్ కాల్వల నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన ప్లాంట్ స్థలాలు సైతం ఇప్పటికే ఆక్రమణల పాలయ్యాయి. మేడారం శివారులోనూ కాల్వ కట్టల ఆక్రమణ ఎక్కువగా ఉంది. జాన్పహాడ్ మేజర్ పరిధిలోని ఆర్-3 కాల్వను నేరేడుచర్ల పట్టణంలో ఓ వైపు కట్ట రెండు, మూడు కిలోమీటర్ల మేర పూర్తిగా ఆక్రమించేశారు. దీనికి తోడు పట్టణవాసులు కాల్వలో వ్యర్థాలు పోస్తుండటంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మిర్యాలగూడ, హుజూర్నగర్ ప్రాంతాలలో కాల్వకట్టల ఆక్రమణలపై పలుసార్లు స్థానికులు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు.
ఆ స్థలం గ్రామపంచాయతీకి అప్పగించారు..
శ్రుతి, సాగర్ ఎడమకాల్వ ఏఈ
ఆక్రమణలకు గురవుతున్న స్థలాన్ని రెవెన్యూశాఖ హరితహారం, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం ఏడెకరాల వరకు గ్రామపంచాయతీకి అప్పగించింది. ఈ ఆక్రమణలను వారే నిలువరించాల్సి ఉంటుంది.
ఆక్రమణలను నిలువరిస్తాం..
రఘు, సాగర్ ఎడమకాల్వ డీఈ
సాగర్ ఎడమ కాల్వ స్థలాలను ఆక్రమిస్తున్న విషయం వాస్తవమే. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇస్తే తప్ప వీటిని ఆపలేని పరిస్థితి. చాలా చోట్ల ఇప్పటికే కాల్వ స్థలాల ఆక్రమణలు జరిగాయి. ఫత్తేపురం వద్ద జరుగుతున్న ఆక్రమణలను నిలువరిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్