ఇంతింతయ్యేందుకు
మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇస్తున్నారు. నల్గొండలోని ఎస్బీఐ ఆర్సెట్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందిస్తూ ఉపాధికి బాటలు వేస్తోంది.
జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
నల్గొండ గ్రామీణం, న్యూస్టుడే
నల్గొండలోని ఎస్బీఐ ఆర్సెట్ కుట్టు శిక్షణలో కాగితాల ద్వారా దుస్తులు కత్తిరించే విధానం నేర్పుతున్న శిక్షకులు
మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇస్తున్నారు. నల్గొండలోని ఎస్బీఐ ఆర్సెట్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందిస్తూ ఉపాధికి బాటలు వేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలను ఎంపిక చేసి కుట్టు శిక్షణ ఇచ్చి ధ్రువపత్రాలు అందిస్తున్నారు. దీంతోపాటు బ్యాంకుల నుంచి అవసరం మేర రుణాలు ఇప్పించి ఉపాధి కల్పించుకునేలా అండగా నిలుస్తున్నారు. నల్గొండలోని టీటీడీసీ భవనంలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నెల రోజుల పాటు 30 మందికి శిక్షణ అందిస్తున్నారు. ఈ నెల రోజులు ఉచితంగా వసతితో పాటు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అనుభవజ్ఞులైన వారితో శిక్షణ ఇప్పించి కుట్టుతోపాటు అల్లికలు, ఎంబ్రాయిడరీ నేర్పుతున్నారు. గతంలో ఇందులో నేర్చుకున్న వారు కొందరు ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందగా, మరి కొందరు హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద పట్టణాల్లో దుస్తుల తయారీ కేంద్రాలో పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. తద్వారా కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు.
ఆర్థిక భరోసా కలుగుతుంది
-లక్ష్మి, పెన్పహాడ్, సూర్యాపేట జిల్లా
ఇంటర్ వరకు చదివాను. ఉచిత శిక్షణతో స్వయం ఉపాధి పొందడంతో పాటు ఆర్థిక భరోసా కలుగుతుందన్న నమ్మకం ఏర్పడింది. కేంద్రంలో ఉచిత భోజన వసతి కల్పించారు. ఇక్కడే ఉండటం వల్ల కుట్టు నేర్చుకోవడం సులభమవుతుంది. పట్టణాల్లో వేలాది రూపాయలు వెచ్చించినా ఇలాంటి శిక్షణ, భోజన సదుపాయం లభించదు. మహిళలు అందరు కలసి శిక్షణ పొందడంతో పాఠశాల రోజులు గుర్తుకు వస్తున్నాయి.
వ్యవసాయ పనికి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది
-యశోద ఎస్.లింగోటం, కనగల్ మండలం
నిత్యం వ్యవసాయానికి వెళ్లటం ఇబ్బందిగా ఉంది. మా కుటుంబ సభ్యుల సహకారంతో కుట్టు శిక్షణ నేర్చుకుంటున్నా. ఇక్కడ చాలా మోడల్స్ నేర్పిస్తున్నారు. ఉచిత కుట్టు శిక్షణ ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకోవడానికి దోహద పడుతుంది.
మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
- పూజ, తుర్కపల్లి, యాదాద్రి జిల్లా
ఎస్బీఐ ఆర్సెట్ నిర్వహించే కుట్టును మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. మహిళలు పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా శిక్షణ ఇస్తున్నారు. త్వరలోనే కుట్టు, అల్లికల కేంద్రం ఏర్పాటు చేసి ఉపాధి పొందుతా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.