అందరి ఇ(క)ళ్లల్లో.. జూన్ ఆందోళన
వేసవి సెలవులు ముగుస్తున్నాయి.. Ëవచ్చేది వానాకాలం. మరో వైపు విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. అన్నీ జూన్ నెలలోనే మొదలు కావడంతో ఒకటో తారీఖు వచ్చిందంటే తల్లిదండ్రులకు వెన్నులో వణుకు పుట్టించే పరిస్థితి నెలకొంటోంది.
దుక్కి దున్ని విత్తనాలు నాటుతున్న కూలీలు (పాత చిత్రం)
భానుపురి, న్యూస్టుడే: వేసవి సెలవులు ముగుస్తున్నాయి.. వచ్చేది వానాకాలం. మరో వైపు విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. అన్నీ జూన్ నెలలోనే మొదలు కావడంతో ఒకటో తారీఖు వచ్చిందంటే తల్లిదండ్రులకు వెన్నులో వణుకు పుట్టించే పరిస్థితి నెలకొంటోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ నెల పెద్ద కుదుపులాంటిదే. ఏడాది మొత్తంలోనే ఎదురు కాని ఆర్థిక భారం జూన్ నెలలో మోయాల్సి వస్తుంది. ఇందుకు ఏ ఒక్కరూ అతీతులు కారు. వేసవి సెలవుల్లో విశ్రాంతి తీసుకున్న వారిని ఉలిక్కిపడేలా చేసే మాసమిది. రెక్కల కష్టం రెండురోజుల్లో ఆవిరవుతుందనే ఆందోళన. ఖర్చుల బండిని సాగదీసే పనిలో కుటుంబ పెద్దలు, ప్రవేశాలు, ఫలితాల హడావుడిలో విద్యార్థులు, సాగు మొదలుపెట్దేదెలా అని రైతులు, వంటింటిని నడిపించేదెలా అని గృహిణులు, ఇలా అందరిలోనూ అంతర్మథనం మొదలవుతోంది.
విద్యార్థులకు అసలు పరీక్ష
సెలవులు అప్పుడే అయిపోవాలా.. ఇంకొన్నాళ్లుంటే బాగుండు, ఇదీ విద్యార్థుల మనసుల్లో ఉండే ఆలోచన. సరదాగా గడిపిన రోజులకు స్వస్తిపలికి చదువులు, పరీక్షలు, కొత్త కోర్సులు ఒకటేంటి అన్ని కష్టాలను మోసుకొచ్చే జూన్ను చూసి విద్యార్థులైతే నిజంగానే జంకుతారు. కొత్తగా పాఠశాలల్లో, కళాశాలల్లో చేరేవారికి ఇదో పెద్ద ప్రయాసే. ఇక మనసులో ఫలితాల అలజడి ఎలాగూ ఉండనే ఉంటుంది.
సంపాదన ఖర్చులకే సరి
ఎన్నిసార్లు లెక్కలేసుకున్నా.. ఎన్ని మినహాయింపులిచ్చినా ఈ నెలలో రాశీవాసి కలవని వారున్నారంటే వారు కచ్చితంగా ఇంటి పెద్దలే. పిల్లల చదువు, పాఠశాలల్లో ఫీజులు, పుస్తకాలు, దుస్తులు ఇలా ఎన్నో రకాల వ్యయం, జీతం ఎంతైనా అంతకు రెట్టింపు ఖర్చులు ఖాయం. ఎల్కేజీ నుంచి ప్రతి విద్యార్థికి మొదట రూ.6వేలు, పుస్తకాలు, తినుబండారాలకు రూ.2500 ఖర్చు వస్తుంది. కళాశాల ఫీజులు మోయలేని భారమే. ఎవరినైనా అప్పు అడుగుదామంటే దాదాపు అందరి ఇళ్లల్లో ఇదే పరిస్థితి.
అన్నదాతల కష్టాలకు బీజం
రైతుల ఆరుగాలం కష్టానికి ఇప్పుడే బీజం పడుతుంది. కాలం కలిసి రాకుంటే ఆ కష్టం రెట్టింపవుతుంది. సాగు కోసం శ్రీకారం చుట్టే మాసమిది. అందరి కంటే ఆర్థిక ఇబ్బందులు అన్నదాతకే ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడులు మొదలు, విత్తన ఎంపిక, ఎరువుల సౌలభ్యం ఇలా ఎన్నో ఆందోళనలు.. అన్నింటికీ ఈ నెలే కారణం. గతేడాది పంటలు నష్టపోయిన డబ్బులు ఇంకా చేతికి రాలేదు. పెరిగిన ధరలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. నకిలీ విత్తనాల భయం పొంచి ఉండనే ఉంది. రైతు దుక్కిదున్ని విత్తనాలు నాటే వరకు ఎకరానికి పత్తి, వేరుసెనగకు రూ.16వేలు వెచ్చించాల్సి వస్తుంది.
ఇల్లాలి ఇబ్బందులు అన్నీఇన్నీ కావు
అందరూ ఎలా ఉన్నా ఇంట్లో ఆర్థిక స్థిరత్వానికి ఇల్లాలి పాత్ర కీలకం. ఒడిదొడుకులు లేకుండా బడ్జెట్ను సరిచేయాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది. వారి చిక్కులు వంటింటి నుంచి మొదలవుతాయి. ఇప్పటికే పెరిగిన ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఖర్చుల ప్రభావం ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా వీరిపైనే ఉంటుంది. పిల్లలను పాఠశాలకు సన్నద్ధం చేయడం, వివిధ పనుల నిమిత్తం వెళ్లే భర్తకు ఆసరాగా ఉండటం లాంటి అదనపు భారాలు మొదలు కానున్నాయి.
తినుబండారాలు తయారు చేస్తున్న మహిళలు(పాతచిత్రం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు