గెట్టు తగాదాలతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ
గెట్టు విషయంలో నెలకొన్న సుమారు గుంట, గుంటన్నర భూమి వివాదం అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది. క్షణికావేశంతో గొడ్డళ్లతో దాడులు చేసుకునే స్థితికి దారి తీసింది.
క్షణికావేశంతో గొడ్డళ్లతో పరస్పరం దాడులు
నలుగురికి తీవ్ర గాయాలు
ఘటనా స్థలంలో క్షతగాత్రులు
అడ్డగూడూరు, న్యూస్టుడే: గెట్టు విషయంలో నెలకొన్న సుమారు గుంట, గుంటన్నర భూమి వివాదం అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది. క్షణికావేశంతో గొడ్డళ్లతో దాడులు చేసుకునే స్థితికి దారి తీసింది. భూ వివాదంలో అన్నదమ్ములు, వారి కుమారుల మధ్య ఘర్షణ తలెత్తగా గొడ్డళ్లతో పరస్పరం కొట్టుకొని తీవ్ర గాయాలపాలైన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంటలో బుధవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మార్త బుచ్చయ్యకు ఇద్దరు కుమారులు వీరయ్య, సైదులు ఉన్నారు. తనకున్న రెండు ఎకరాల భూమిని ఇద్దరికి సమానంగా పంచారు. ఇద్దరి మధ్య కొంతకాలంగా సరిహద్దు(గెట్టు) తగాదాలు జరుగుతున్నాయి. మూడు అడుగులు వెడల్పుతో పొడువునా ఉండే గెట్టు విషయంతో గొడవ జరుగుతోంది. మంగళవారం పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టగా, బుధవారానికి వాయిదా వేశారు. ఇంతలో పెద్దకుమారుడు వీరయ్య, తన కుమారుడు ప్రభాస్ తమ చెల్కలో పత్తి విత్తనాలు విత్తడానికి కూలీ మనిషి గుర్రం కొమరయ్యతో అచ్చు తోలుతున్నారు. అదే సమయంలో ఆయన తమ్ముడు సైదులు, తన కుమారుడు శేఖర్ చెరో గొడ్డలి పట్టుకొని అక్కడికి చేరుకొన్నారు. పంచాయతీ తీర్మానం కాలేదు.. భూమి కొలవక ముందే ఎందుకు దున్నిస్తున్నారని గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు అన్నదమ్ములు, వారి కుమారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. క్షణికావేశంతో గొడ్డళ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో తమ్ముడు మార్త సైదులు ఎడమచేయి తెగిపడగా, అతని కుమారుడు శేఖర్ వెన్నెముకకు గొడ్డలివేటు పడటంతో తీవ్రగాయాలయ్యాయి.
* అన్న మార్త వీరయ్య భుజంపై గొడ్డలివేటు పడగా, అతని కుమారుడు ప్రభాస్ తలకు తీవ్రం కాగా.. వేటుకు మూడు చోట్ల ఎడమచేతి విరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులు అన్నదమ్ములు, వారి కుమారులను ఒకే 108 వాహనంలో మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం భువనగిరి జనరల్ ఆస్పత్రికి అటు నుంచి హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఊహించని పరిణామంతో మానాయికుంట గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. సంఘటనా స్థలాన్ని రామన్నపేట సీఐ మోతీరాం, ఎస్సై ఉదయ్కిరణ్ పరిశీలించారు. ఈ మేరకు ఇరువర్గాల వారిపైన హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఉదయ్కిరణ్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత