దగా ఆలోచనలపై.. నిఘా
గత అసెంబ్లీ ఎన్నిల సందర్భంగా 28 ఏళ్ల యువకుడు భువనగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థికి సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.
అభ్యంతరకర పోస్టులు షేర్ చేస్తే చిక్కులే
గత అసెంబ్లీ ఎన్నిల సందర్భంగా 28 ఏళ్ల యువకుడు భువనగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థికి సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. కించపర్చే విధంగా ఉన్న సదరు వీడియోపై ఫిర్యాదులు రావడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్తో పాటు, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగ వేటలో ఉన్న ఆ యువకుడు కేసుల్లో చిక్కుకోవడంతో ఉన్నత ఆశయం చేరుకోవడానికి ప్రతిబంధకంగా మారింది.
గత శాసనసభ ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాలపై వచ్చిన ఫిర్యాదులు, పోలీసుల నిఘా ద్వారా గుర్తించిన వాటిపై దాదాపుగా జిల్లాలో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, ఎన్నికల నియమావళి ఉల్లంఘన, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఎన్నికల వేళ ఒక్కసారి కేసులు నమోదు అయితే వాటిని పరిష్కరించుకోవడానికి వీలులేకుండా ఉంటాయి. తప్పనిసరిగా కోర్టు విచారణ ఎదుర్కోవాల్సిందే.
భువనగిరి నేరవిభాగం, న్యూస్టుడే: సామాజిక మాధ్యమాల్లో కుప్పలు తెప్పలుగా పోస్టులు, వీడియోలు, రీల్స్ వస్తుంటాయి. ఎన్నికల సమయంలో ప్రతి అంశం, తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. తమ అభిమాన పార్టీలు, నాయకులుకు ప్రచారం కల్పించాలనే కుతుహలంతో ప్రత్యుర్థులుగా ఉండేవారిపై రకరకాలుగా పోస్టులు, వీడియోలను వాట్సప్, ఫేస్బుక్ ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేస్తుంటారు. అభ్యర్థులు, పార్టీలకు సంబంధించిన అభ్యంతరకరమైన అంశాలతో పాటు, కించపర్చే వ్యాఖ్యలు ఉంటాయి. వాటిని చూస్తూ ఇతరులకు షేర్ చేయాలనే ఉత్సాహంతో మరిన్ని గ్రూపులలో పోస్టు చేస్తుంటారు. తెలియక చేసిన పోస్టులే కేసుల్లో చిక్కుకునేలా చేస్తాయి. ఎన్నికల సమయంలో కేసుల్లో అభ్యంతకరమైన పోస్టులపై అందిన ఫిర్యాదులతో పోలీసులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద నమోదు చేస్తున్నారు. యువతపై ఎన్నికల వేళ నమోదైన కేసులు వెంటాడుతుంటాయి. కేసుల్లో ఇరుక్కోవడంతో చదువు, ఉద్యోగంపై ప్రభావం పడుతుంది.
గ్రూప్ అడ్మిన్ తస్మాత్ జాగ్రత్త
వాట్సప్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లోని గ్రూపుల్లో ఉండే సభ్యులు ఇష్టానుసారంగా పోస్టులు, వ్యాఖ్యానాలు చేస్తుంటారు. అభ్యంతరకర పోస్టులకు గ్రూపు అడ్మిన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాటిలో వచ్చే రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు, అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేవిధంగా చేసినట్లయితే వాటికీ బాధ్యత వహించాల్సిదేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నిరాధారమైన పోస్టులు చేస్తే చర్యలు తప్పవు
ఎం.రాజేశ్చంద్ర, డీసీపీ
ఎన్నికల నియమావళి అమలులో భాగంగా సోషల్మీడియోపై ప్రత్యేక నిఘా ఉంచాం. వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేవిధంగా వీడియోలు, వ్యాఖ్యానాలు చేసినట్లయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్తో పాటు, ప్రజాప్రతినిధ్య, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తాం. ఎన్నికల వేళ వాట్సప్ గ్రూపుల్లో చేసే చర్చలు హద్దుదాటితే చర్యలు తప్పవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం