logo

బార్‌ అధ్యక్షుడిగా సుదర్శన్‌రెడ్డి ఎన్నిక

సూర్యాపేట జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌కు గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకల సుదర్శన్‌రెడ్డి ఎన్నికయ్యారు.

Published : 29 Mar 2024 02:28 IST

సుదర్శన్‌రెడ్డి , మల్లయ్య

సూర్యాపేట న్యాయవిభాగం, న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌కు గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకల సుదర్శన్‌రెడ్డి ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి జటంగి వెంకటేశ్వర్లుపై 24 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఉపాధ్యక్షుడిగా ఎం.ఎన్‌.వరప్రసాదరావు తన ప్రత్యర్ధి టి.మురళిపై 69 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా డపుకు మల్లయ్య తన ప్రత్యర్ధి ఎమ్‌.వెంకన్నపై 36 ఓట్ల తేడాతో గెలుపొందారు. క్రీడల, సాంస్కృతిక కార్యదర్శిగా జె.చంద్రమౌళి విజయం సాధించారు. వీరితోపాటు సహాయ కార్యదర్శిగా పెండెం వాణి, కోశాధికారిగా డి.వీరేష్‌కుమార్‌, గ్రంథాలయ కార్యదర్శిగా అబ్దుల్‌ లతీఫ్‌ మహ్మద్‌, కార్యవర్గ సభ్యులుగా చంద్రమౌళి, సుంకర రవి, డి.వెంకటరెడ్డి, కె.వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి గూడూరి శ్రీనివాస్‌ గురువారం కార్యవర్గంపై అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని