అక్షర ఒరవడి
నెల్లూరు కొందరి ఆలోచనలు సముద్రపు లోతుల్ని కొలుస్తాయి. మరికొందరివి హిమాలయమంత ఎత్తు ఉంటాయి. చదువంటే విద్యార్థులకు నాలుగు అక్షరాలు చెప్పడం కాదు. అదనంగా జీవన నైపుణ్యాలు నేర్పించాలి. అయితే అవి పూర్తిస్థాయిలో వారికి అందడం లేదు. రెండేళ్లుగా చిన్నారుల
ఈనాడు డిజిటల్, నెల్లూరు కొందరి ఆలోచనలు సముద్రపు లోతుల్ని కొలుస్తాయి. మరికొందరివి హిమాలయమంత ఎత్తు ఉంటాయి. చదువంటే విద్యార్థులకు నాలుగు అక్షరాలు చెప్పడం కాదు. అదనంగా జీవన నైపుణ్యాలు నేర్పించాలి. అయితే అవి పూర్తిస్థాయిలో వారికి అందడం లేదు. రెండేళ్లుగా చిన్నారుల చదువులపై కొవిడ్ తీవ్ర ప్రభావం చూపింది. కొన్నాళ్ల పాటు తరగతులు నిర్వహించలేని పరిస్థితి. ఆన్లైన్ తరగతులు నిర్వహించినా అవి అంతంతమాత్రమే. దాంతో పాఠ్యాంశాలపై పట్టు లేక ఉత్తమ ఫలితాలు సాధించడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు విద్యాశాఖ.. పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తరగతుల వారీగా విద్యార్థుల్లో సామర్థ్యం పెంచేలా రూపకల్పన చేసింది. బడుల్లో చదివే విద్యార్థులతో పాటు డ్రాపౌట్లు, వలస కూలీల పిల్లలకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వివరాలను సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి ఉషారాణి వివరించారు.
పఠనంపై పట్టు కోసం..
పాఠ్యపుస్తకాల్లోని పాఠాలు అర్థవంతంగా చదివించడమే లక్ష్యంగా జిల్లాలో విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ‘చదవడం మాకిష్టం’ అనే పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ఈనెల 6వ తేదీ ప్రారంభమైంది. దాదాపు 100 రోజుల పాటు అంటే ఏప్రిల్ 30వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో కేవలం పాఠ్యంశాలే కాకుండా నీతికథలు, మహనీయుల జీవిత చరిత్రలు, స్వాతంత్య్ర సమరయోధులు, శాస్త్రవేత్తల గురించి విద్యార్థులకు వివరించనున్నారు. దీన్ని జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లోనూ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రీప్రైమరీ నుంచి 2వ తరగతి వరకు, మూడు నుంచి అయిదు, ఆరు నుంచి ఎనిమిది తరగతులు ఇలా మూడు గ్రూపులుగా విభజించారు. పాఠ్యాంశాల వారీగా ఉపాధ్యాయులు నిర్దేశించిన సమయాల్లో విద్యార్థులను చదివిస్తున్నారు. ప్రతి పాఠశాలలో ఇందుకు ఒక గంట కేటాయిస్తున్నారు.
విద్యార్థులు వెనుకంజలో లేకుండా..
పలు కారణాలతో బడి మానేసిన చిన్నారులు, వలస కూలీల పిల్లలు చదువులో వెనుకంజలో లేకుండా ఉండేందుకు సర్వశిక్షా అభియాన్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. డ్రాపౌట్ల కోసం నేతాజీ సుభాష్చంద్రబోస్ హాస్టళ్ల పేరుతో 100 మంది విద్యార్థులకు ఏడాది పాటు తరగతులు నిర్వహించనుంది. పోలీసులతో కలసి సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపడుతోంది. దాంతో పాటు ఇటుక బట్టీలు, పొలాలు, పరిశ్రమల్లో పనిచేసేందుకు వలస వచ్చే కూలీల పిల్లల చదువులు మధ్యలో ఆగిపోకుండా ఉండేందుకు జిల్లాలోని అయిదు ప్రాంతాల్లో సీజనల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. విడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఓజిలి, జలదంకి మరో మండలంలో వచ్చే నెల నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి.
అచ్చం అలా తీర్చిదిద్దేలా..
పాఠ్యాంశంపై విద్యార్థుల దృష్టి, మనస్సు కేంద్రీకరించేలా పాఠశాలల్లోని కొందరు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోనున్నారు. బోధన అంశంపై ఛార్టులు, బొమ్మలు, ఫ్లాష్కార్డులు, టూడీ, త్రీడీ చిత్రాలను ముందుగానే రూపొందించుకొని దృశ్యరూపకంగానూ వివరించనున్నారు. ఇలా ఆదర్శంగా నిలిచిన ఆ పాఠశాలను సమీప బడుల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులు సందర్శించి అదే మార్గాన్ని అనుసరించనున్నారు. ఇలా పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 100 పాఠశాలలను ఆదర్శంగా నిలిపి మరో వంద పాఠశాలలను అదేవిధంగా మార్పు (ట్విన్నింగ్) చేయనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలను సందర్శించేందుకు, ఇతర ఖర్చులకు రూ.వెయ్యి చొప్పున ప్రభుత్వం అందజేస్తోంది. ఆర్ట్అండ్ క్రాఫ్ట్, స్థానిక పండుగలు, వ్యవసాయం, పరిశ్రమలు ఇలా వివిధ అంశాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని రూపొందించారు.
ట్విన్నింగ్ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం