గంగ కాలువలో ఇద్దరి దుర్మరణం
వారు ముగ్గురూ కళాశాల రోజుల నుంచి మిత్రులు. బుధవారం సరదాగా కలిశారు. గ్రామానికి దగ్గర్లోని తెలుగుగంగ బ్రాంచి కాలువ వద్దకు వెళ్లారు. అందులోకి దిగిన కాసేపటికే.. ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందగా- ఒకరు అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకుని ప్రాణాలతో బయటపడ్డారు.
పుదూరులో విషాదం
నాయుడుపేట, న్యూస్టుడే: వారు ముగ్గురూ కళాశాల రోజుల నుంచి మిత్రులు. బుధవారం సరదాగా కలిశారు. గ్రామానికి దగ్గర్లోని తెలుగుగంగ బ్రాంచి కాలువ వద్దకు వెళ్లారు. అందులోకి దిగిన కాసేపటికే.. ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందగా- ఒకరు అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకుని ప్రాణాలతో బయటపడ్డారు. నాయుడుపేట మండలం పుదూరు గ్రామ సమీపంలోని తెలుగుగంట బ్రాంచి కాలువ వద్ద బుధవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. పుదూరుకు చెందిన పేరాని మునెయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు జగన్ (22). ఐటీఐ పూర్తి చేసి.. కొన్ని నెలలుగా ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఇదే గ్రామానికి చెందిన కొండారి చెంచయ్య, పద్మమ్మ దంపతుల కుమారుడు చైతన్య (22). బీటెక్ పూర్తి చేశారు. ఇటీవలే చెన్నైలోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా ఉద్యోగం వచ్చింది. గురువారం వెళ్లి చేరాల్సి ఉంది. వీరిద్దరి మిత్రుడు.. వాకాడుకు చెందిన మల్లు విష్ణు. ముగ్గురు కలిసి బుధవారం ఉదయం గ్రామంలో సరదాగా తిరిగారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో దగ్గర్లోని తెలుగుగంగ బ్రాంచి కాలువ వద్దకు వెళ్లి ఈతకు దిగారు. ఆ క్రమంలో జగన్, చైతన్య నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా.. విష్ణు అతికష్టం మీద గట్టుకు చేరుకుని కేకలు వేశారు. దాంతో అక్కడికి కొంత దూరంలోని వారు వచ్చి కాలువలో గాలింపు చేపట్టేలోపే ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రమాద స్థలం రెండు మండలాల సరిహద్దులో ఉండటంతో స్థానికులు మొదట దొరవారిసత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాయుడుపేట, దొరవారిసత్రం ఎస్సైలు సీహెచ్ కృష్ణారెడ్డి, తిరుమలరావు పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్షలు నియమిత్తం నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన ఇద్దరు యువకులు తల్లిదండ్రులకు ఏకైక పుత్ర సంతానం కావడంతో వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి