దారుణహత్య
ఆటో డ్రైవరును దారుణంగా హత్య చేశారు.. బ్లేడుతో విచక్షణా రహితంగా గొంతు కోసి.. తలపై రాడ్డుతో మోది కడతేర్చారు. ఈ దారుణ ఉదంతం నెల్లూరులో శుక్రవారం వెలుగు చూసింది. పల్లిపాడులోని శివారు ప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు వేదాయపాళెం పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఇన్స్పెక్టర్
సంఘటనా స్థలంలో పోలీసుల దర్యాప్తు
నెల్లూరు(నేర విభాగం), న్యూస్టుడే: ఆటో డ్రైవరును దారుణంగా హత్య చేశారు.. బ్లేడుతో విచక్షణా రహితంగా గొంతు కోసి.. తలపై రాడ్డుతో మోది కడతేర్చారు. ఈ దారుణ ఉదంతం నెల్లూరులో శుక్రవారం వెలుగు చూసింది. పల్లిపాడులోని శివారు ప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు వేదాయపాళెం పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హతుడు వెంగళరావునగర్ మూడో వీధికి చెందిన కోటకొండ అంకయ్య, సునీత దంపతుల కుమారుడు సునీల్(18)గా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అంకయ్య.. భార్య, కుమారుడిని వదిలిపోగా- సునీల్ ఆటో నడుపుతూ తల్లిని పోషిస్తున్నాడు. ఈ నెల 27వ తేదీ రాత్రి 8 గంటలకు గొలగమూడికి బాడుగ వచ్చిందని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి అయినా ఇంటికి రాలేదు. కాల్ చేస్తే సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆటో నడుపుకొంటూ ఉంటాడని భావించి.. ఆమె నిద్రపోయారు. శుక్రవారం పడారుపల్లి బుజ్జయ్య లేఅవుట్లో విగత జీవిగా కనిపించాడు. మృతదేహం ఉన్న ప్రాంతానికి దాదాపు 50 మీటర్ల దూరంలో రక్తపు మరకలు పడి ఉన్నాయి. దీంతో సునీల్ను అక్కడ హత్య చేసి.. లాక్కొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా గుర్తించి.. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆటో లోపలి సీట్లలో మద్యంతో ఉన్న గ్లాసులు ఉన్నాయి. మద్యం తాగి.. ఆ మత్తులో ఉండగానే సునీల్ను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్పీ ఆగ్రహం.. ముగ్గురిపై వేటు
నెల్లూరు (నేర విభాగం) : ఆటో డ్రైవరు హత్యోదంతంపై ఎస్పీ సీహెచ్ విజయ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు స్టేషన్ పరిధిలో గస్తీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్కు పిలిచారు. రాత్రి గస్తీ నిర్వహించిన ఆర్ఎస్సైను జిల్లా ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక