Andhra News: ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

ఏపీలో మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు.....

Updated : 25 May 2022 21:10 IST

దిల్లీ: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్‌ విడుదల చేసింది. మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో జూన్‌ 23న పోలింగ్‌ జరపాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మూడు లోక్‌సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం రాత్రి ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ముఖ్యమైన తేదీలు:

  • ఉప ఎన్నికలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల: మే 30
  • నామినేషన్లకు తుది గడువు: జూన్‌ 6
  • నామినేషన్ల పరిశీలన: జూన్‌ 7
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు: జూన్‌ 9
  • పోలింగ్‌ తేదీ: జూన్‌ 23
  • ఓట్ల లెక్కింపు: జూన్‌ 26

ఉప ఎన్నికలు జరిగే లోక్‌సభ/ అసెంబ్లీ స్థానాలివే..

సంగ్రూర్‌ (పంజాబ్‌), రాంపూర్‌, అజంగఢ్‌ (యూపీ) పార్లమెంట్‌ స్థానాలతో పాటు అగర్తలా, టౌన్‌ బోర్డోవలి, సుర్మా, జుబరాజ్‌నగర్‌ (త్రిపుర), ఆత్మకూరు (ఏపీ), రాజిందర్‌నగర్‌ (దిల్లీ), మందర్‌ (ఝార్ఖండ్‌) అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి.

ఆ రాష్ట్రాల్లో 30 ఎమ్మెల్సీ స్థానాలకూ ఎన్నికలు..

వీటితో పాటు ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్‌లలో త్వరలో ఖాళీ అవుతున్న 30ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు కూడా ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. జులై 6 నాటికి యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు 13 మంది సభ్యుల పదవీ కాలం ముగియనుండగా.. మహారాష్ట్రలో జులై 7 కల్లా 10 మంది ఎమ్మెల్సీలు, బిహార్‌లో ఏడుగురి పదవీ కాలం జులై 21 నాటితో ముగినుంది. ఖాళీ కాబోతున్న ఈ 30 స్థానాలకు జూన్‌ 20న ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని