Andhra News: ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
ఏపీలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు.....
దిల్లీ: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో జూన్ 23న పోలింగ్ జరపాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మూడు లోక్సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం రాత్రి ఈసీ షెడ్యూల్ను విడుదల చేసింది.
ముఖ్యమైన తేదీలు:
- ఉప ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల: మే 30
- నామినేషన్లకు తుది గడువు: జూన్ 6
- నామినేషన్ల పరిశీలన: జూన్ 7
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: జూన్ 9
- పోలింగ్ తేదీ: జూన్ 23
- ఓట్ల లెక్కింపు: జూన్ 26
ఉప ఎన్నికలు జరిగే లోక్సభ/ అసెంబ్లీ స్థానాలివే..
సంగ్రూర్ (పంజాబ్), రాంపూర్, అజంగఢ్ (యూపీ) పార్లమెంట్ స్థానాలతో పాటు అగర్తలా, టౌన్ బోర్డోవలి, సుర్మా, జుబరాజ్నగర్ (త్రిపుర), ఆత్మకూరు (ఏపీ), రాజిందర్నగర్ (దిల్లీ), మందర్ (ఝార్ఖండ్) అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఆ రాష్ట్రాల్లో 30 ఎమ్మెల్సీ స్థానాలకూ ఎన్నికలు..
వీటితో పాటు ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్లలో త్వరలో ఖాళీ అవుతున్న 30ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు కూడా ఈసీ షెడ్యూల్ను ప్రకటించింది. జులై 6 నాటికి యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు 13 మంది సభ్యుల పదవీ కాలం ముగియనుండగా.. మహారాష్ట్రలో జులై 7 కల్లా 10 మంది ఎమ్మెల్సీలు, బిహార్లో ఏడుగురి పదవీ కాలం జులై 21 నాటితో ముగినుంది. ఖాళీ కాబోతున్న ఈ 30 స్థానాలకు జూన్ 20న ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..