పరీక్షా కాలం.. పట్టించుకోక దైన్యం!
జిల్లాలో సాంఘిక, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మండల వసతి గృహాల్లో ట్యూటర్లు ఉన్నా, నెల్లూరులో పూర్తిస్థాయిలో
న్యూస్టుడే, నెల్లూరు (సంక్షేమం)
నందిపాడులో విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు (పాతచిత్రం)
జిల్లాలో సాంఘిక, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మండల వసతి గృహాల్లో ట్యూటర్లు ఉన్నా, నెల్లూరులో పూర్తిస్థాయిలో లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గత విద్యా సంవత్సరం తక్కువ ఫలితాలు సాధించిన హాస్టళ్లు.. ఈసారైన నూరుశాతం సాధిస్తాయా అంటే కనుచూపుమేరలో ఆ చర్యలు కనిపించడం లేదు. మరో అయిదు రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నిష్ణాతులైన ట్యూటర్ల ద్వారా బోధన జరగాల్సి ఉన్నా.. కొన్నిచోట్ల ఒకరిద్దరే ఉన్నారు.
నగరంలో దయనీయం
* సాంఘిక, బీసీ సంక్షేమానికి చెందిన 96 వసతి గృహాల్లో 1,336 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఒక్కో దానికి నలుగురు ట్యూటర్లను నియమించాల్సి ఉంది. ప్రస్తుతం సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల్లో 43 చోట్ల పది విద్యార్థులుండగా.. 25 చోట్ల పూర్తిస్థాయిలో ఉండగా.. మిగతా చోట్ల ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు.
* మండలాల్లోని 53 బీసీ సంక్షేమ వసతిగృహాల్లో 720 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో పూర్తిస్థాయిలో ట్యూటర్లు ఉన్నారని, నెల్లూరులో తక్కువ మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. వీరు ఇంగ్లిషు, గణితం, సైన్సు, హిందీ పాఠ్యాంశాలను బోధించి అభ్యసనం చేయించాల్సి ఉంది. ఎక్కువ మంది ట్యూటర్లు విద్యార్థులే చదువుకోవాలని గంటసేపు కూర్చొని వెళుతున్నారు. ట్యూటర్లకు ఒక్కొక్కరికి రూ.1500 నెలకు ఇస్తున్నారు. తక్కువ మొత్తంలో ఇస్తుండటంతో నిష్ణాతులైన బోధకులు ముందుకు రావడం లేదు. అయితే ఈ వేతనాలు కూడా సక్రమంగా రావడంలేదు.
గత ఏడాది ఇలా..
సంక్షేమ వసతిగృహాల్లో రెండేళ్లుగా ఎలాంటి బోధన ప్రక్రియ చేపట్టడం లేదు. దాంతో 2021-22 విద్యా సంవత్సరానికి సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 530 మంది విద్యార్థులకు పరీక్ష రాస్తే 252 మంది ఫెయిల్ అయ్యారు. బీసీ సంక్షేమ శాఖ వసతిగృహాల్లో 512కి 139 మంది ఉత్తీర్ణులు కాలేదు.
కార్యాచరణేది?
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు గతంలో ఛాలెంజ్ లెర్నింగ్ ప్రోగ్రాం ద్వారా గ్రేడింగ్ చేసి విద్యార్థులను చదివించేవారు. వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించేవారు. ప్రస్తుతం ఎలాంటి విధానం అమలు చేయడం లేదు. పాఠశాలలో అందించిన బోధనే దిక్కవుతోంది. విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేసేవారు కరవయ్యారు.
నూరుశాతం ఫలితాలు సాధించేలా చర్యలు
వెంకటయ్య, బీసీ సంక్షేమశాఖ అధికారి
ఎస్సీ, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో పదో తరగతి విద్యార్థులు నూరుశాతం ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని మండల కేంద్రాల్లోని వసతిగృహాల్లో పూర్తిగా ట్యూటర్లు ఉన్నారు. నెల్లూరులోనూ విద్యార్థులను చదివించేలా వసతిగృహ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలు అయ్యేంత వరకు సహాయ సంక్షేమాధికారులు నిరంతరం పరిశీలించాలని సూచించాం. అందులో భాగంగా వారు నిత్యం తనిఖీలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!