హార్మోన్లపై ప్రభావం..మానసిక కల్లోలం
ఎండలు మండుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 42 డిగ్రీలపైనే నమోదవుతోంది. ఎండ దెబ్బతో డీహైడ్రేషన్ మాత్రమే కాకుండా మెదడుపైనా ప్రభావం పడుతుంది.
ఎండలు మండుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 42 డిగ్రీలపైనే నమోదవుతోంది. ఎండ దెబ్బతో డీహైడ్రేషన్ మాత్రమే కాకుండా మెదడుపైనా ప్రభావం పడుతుంది. శరీరంలోని సోడియం, పొటాషియం ఇతర లవణాలు తగ్గి చివరికి మానసిక కల్లోలానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటినే సీజనల్ ఎఫెక్ట్ డిజార్డర్స్గా వ్యవహరిస్తారు.
* రుతువులు మారిన ప్రతిసారి ఆ ప్రభావం జీవులపై పడుతుంది. సాధారణంగా చలికాలంలో కొందరు కుంగుబాటుకు లోనవుతారు. వేసవిలోనూ కొన్ని రకాల మానసిక సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా వేసవిలో పగటి సమయం ఎక్కువ. అందుకు తగ్గట్లు శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది కొందరిలో హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. ఇదే మానసిక సమస్యలకు దారి తీస్తుంది.
* కొందరి ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటాయి. ఎక్కువ మాట్లాడటం.. పాటలు పాడటం.. నృత్యాలు చేయడం.. పనులు ఎక్కువ చేయడం లాంటి లక్షణాలు వీరిలో కన్పిస్తుంటాయి. ఇవి మరీ ఎక్కువైతే ఇతర సమస్యలకు దారితీస్తాయి.
* ఇలాంటి లక్షణాలు ఉంటే ఎండలో తిరగడం తగ్గించాలి. వీలైతే చల్లని ప్రాంతాల్లో ఉండేలా చూడాలి.ఎక్కువ కాంతి ఉన్న లైట్లు శరీరం, ముఖంపై పడకుండా చూసుకోవాలి.
* ఎండలో తిరగడం వల్ల శరీరం నుంచి అదే పనిగా చెమట రూపంలో నీళ్లు పోతుంటాయి. ఇదే సమయంలో ఎలక్ట్రోలైట్స్ అయిన సోడియం, పొటాషియం ఇతర మూలకాలను శరీరం కోల్పోతుంది. ఈ ప్రభావం ఒక్కసారిగా మెదడుపై పడుతుంది. రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. ఇవే మానసిక సమస్యలకు కారణమవుతాయి.
* చిరాకుగా మాట్లాడటం, పెద్దపెద్ద శబ్దాలు విన్పిస్తున్నట్లు భ్రమించడం, కుటుంబ సభ్యులను గుర్తించకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో ఈ పరిస్థితి కన్పిస్తుంది. ఈ లక్షణాలు గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులకు చూపించడం మంచిది.
* నిమ్మరసం, ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం లాంటివి తీసుకుంటూ ఉంటే ఎలక్ట్రోలైట్స్ తగ్గకుండా చూసుకోవచ్చు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ భక్షణ చట్టం
[ 07-05-2024]
ల్యాండ్ టైటిలింగ్ చట్టం. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అరాచక చట్టం కొత్తకష్టాలు తెచ్చిపెట్టింది. ఆక్రమణలకు పట్టం కట్టేలా ఉంది. మున్ముందు భూ రక్షణకు, ఆస్తుల భద్రతకు చెల్లుచీటి పలికే దీన్ని ఊహించుకుంటేనే భయానకం. -
భూ హక్కు చట్టంతో భూములు కొట్టేస్తారు
[ 07-05-2024]
భూహక్కు యాజమాన్య చట్టం పేరుతో పేదల భూములు కోట్టేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి కన్నేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. మండలంలోని చిన్నచెరుకూరులో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పథకాలు నిర్వీర్యం అర్చకులపై దౌర్జన్యం
[ 07-05-2024]
గత తెదేపా ప్రభుత్వ పాలనలో బ్రాహ్మణుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అయిదేళ్లలో తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్చకులపై అధికార వైకాపా దౌర్జన్యాలు తప్ప.. -
ఉదయగిరిలో వడగండ్ల వాన
[ 07-05-2024]
మండలంలో సోమవారం బలమైన ఈదురు గాలులతో ఒకమోస్తారు వడగండ్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తాకిడి ఎక్కువగా ఉంది. -
అవ్వా తాతాలకు.. పింఛన్ టెన్షన్
[ 07-05-2024]
జిల్లాలో 37 మండలాలు, 768 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 3,15,423 మంది పింఛనుదారులున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ల మంజూరు నుంచి పంపిణీ వరకు లబ్ధిదారులను వంచనకు గురిచేస్తోంది. -
ఉదయగిరిలో పోస్టల్ ఓటింగ్ పరిశీలన
[ 07-05-2024]
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగులకు కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను సోమవారం కలెక్టరు హరినారాయణన్ పరిశీలించారు. -
జనం ఆస్తులపై జగన్ కుట్ర
[ 07-05-2024]
ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వమే అధికారికంగా దోచేందుకు కుట్ర పన్నింది. ‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’తో ప్రజల స్థలాలు, పొలాలు, భూములు తదితర ఆస్తులకు రక్షణ లేకుండా పోయే ప్రమాదం ఉందని వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
బీసీ కాలనీలో మౌలిక వసతుల లేమి
[ 07-05-2024]
పంచాయతీ పరిధిలో రెండు వార్డులున్న బీసీ కాలనీ అనేక సమస్యలతో సతమతవుతోంది. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వీధులకు సిమెంటు రోడ్లు లేవు. కొన్ని వీధులకు ఉన్నా వాటికి అనుగుణంగా మురుగు కాలువలు లేవు. -
జనతాపేట.. సమస్యల మేట
[ 07-05-2024]
పట్టణంలోని జనతాపేట ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విస్తరించింది. రైల్వే పట్టాలకు పడమర వైపు ఉంది. రైల్వే శాఖ, పురపాలక సంఘాలకు నడుమ సమన్వయం లేక సమస్యలు పరిష్కారం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!