పేలుడులో గాయపడిన మరొకరి మృతి
మాముడూరులో గత నెల 27న జరిగిన బాణసంచా పేలుడుతో తీవ్రంగా గాయపడిన కోవూరు వాసి చలంచర్ల రమేష్(32) చికిత్స పొందుతూ మృతిచెందినట్లు గురువారం ఎస్సై మరిడినాయుడు తెలిపారు.
చేజర్ల, న్యూస్టుడే: మాముడూరులో గత నెల 27న జరిగిన బాణసంచా పేలుడుతో తీవ్రంగా గాయపడిన కోవూరు వాసి చలంచర్ల రమేష్(32) చికిత్స పొందుతూ మృతిచెందినట్లు గురువారం ఎస్సై మరిడినాయుడు తెలిపారు. నెల్లూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం మృతిచెందారు. ఈ సంఘటనలో ఇద్దరు మృతిచెందగా, ముగ్గురు కోలుకొని ఇళ్లకు వెళ్లారని పేర్కొన్నారు.
అత్యాచార యత్నం కేసులో నిందితులకు రిమాండ్
కందుకూరు పట్టణం, న్యూస్టుడే: బధిర మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కందుకూరు మండలంలోని మాచవరం ఎస్సీ కాలనీకి చెందిన ఓ బధిర మహిళపై పట్టణానికి చెందిన ఫైరోజ్బాషా, కరణ్, జోషి పట్టణ శివారులో మంగళవారం రాత్రి అత్యాచారానికి యత్నించారు. పెట్రోల్ బంకు సిబ్బంది, దిశ యాప్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆమెను రక్షించడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గురువారం కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
పేలిన బ్యాటరీ ద్విచక్రవాహనం
ఇందుకూరుపేట, న్యూస్టుడే: బ్యాటరీ వాహనం పేలి త్రుటిలో ప్రమాదం తప్పిన ఘటన గురువారం ముదివర్తిపాలెంలో జరిగింది. బాధితుడి వివరాల మేరకు గ్రామానికి చెందిన చిట్టిబోయిన శివకుమార్ కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. ఏడాది క్రితం ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. గురువారం పొలంలోకి వెళ్లేందుకు వాహనాన్ని ఆన్ చేయగా ఒక్కసారికి బ్యాటరీ పేలి మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురయ్యాడు. విషయాన్ని సదరు కంపెనీ ప్రతినిధులకు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వాహనదారుడు పేర్కొన్నారు.
మినీ వ్యానును ఢీకొన్న కారు
28 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం
రాపూరు, న్యూస్టుడే: కారు ఢీకొనడంతో మినీ వ్యాను బోల్తాపడి 28 మందికి గాయాలైన ఘటన గురువారం మండలంలోని పెనుబర్తి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం వాలిచెర్లకు చెందిన పలువురు తోటపల్లిగూడూరు మండలంలోని ఓ ప్రార్థనా మందిరానికి మినీవ్యాన్లో పయనమయ్యారు. పెనుబర్తి సమీపంలో రాపూరు నుంచి వెళుతున్న కారు ఢీకొనడంతో అదుపుతప్పి బోల్తాపడటంతో పలువురికి గాయాలయ్యాయి. 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో జాతీయ రహదారి అంబులెన్స్ వచ్చే దాకా క్షతగాత్రులు ఇబ్బందులుపడ్డారు. వీరిని రాపూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యసేవలందించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యాధికారిణి సరస్వతి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాపూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు