logo

విద్యుత్ నియంత్రణ అవసరం

విద్యుత్ నియంత్రణ అవసరమని కొండాపురం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు ఎస్‌కే ఖాదర్‌ బాషా తెలిపారు.

Published : 28 Mar 2024 18:42 IST

కొండాపురం: విద్యుత్ నియంత్రణ అవసరమని కొండాపురం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు ఎస్‌కే ఖాదర్‌ బాషా తెలిపారు. ఆదర్శ పాఠశాల నుంచి విద్యుత్ కేంద్రం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు విద్యుత్తు వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించారు. వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని