ఉపకార వేతనాల దరఖాస్తుల్లో జిల్లా ప్రథమం
ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేయించడంలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో బుధవారం నిర్వహించిన
మాట్లాడుతున్న కలెక్టర్ జితేష్ వి పాటిల్, పక్కన ఎస్పీ శ్రీనివాస్రెడ్డి
కామారెడ్డి కలెక్టరేట్, న్యూస్టుడే: ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేయించడంలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో బుధవారం నిర్వహించిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రతి నెల చివరి రోజున జరిగే పౌరహక్కుల దినోత్సవ సమావేశాలకు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులను ఆహ్వానించాలని సూచించారు. ఎస్పీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. పోలీసుస్టేషన్ల వారీగా పెండింగ్ కేసులను వర్గీకరించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం గత సమావేశంలో చర్చించిన అంశాల పురోగతిని ఎస్సీ సంక్షేమాధికారిణి రజిత వివరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అన్యోన్య, ఎస్టీ సంక్షేమాధికారి అంబాజీ, బీసీ సంక్షేమాధికారి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, డీఎస్పీలు సోమనాథం, శశాంక్రెడ్డి, జైపాల్రెడ్డి, జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మల్లికార్జున్, మల్లయ్య, రాజు, గణేశ్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
‘ఎన్నికల ముచ్చట్లు’ పుస్తకావిష్కరణ : ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రానికి చెందిన రాజనీతిశాస్త్ర ఉపన్యాసకుడు వైద్య ఉమాశేషారావు రచించిన ‘ఎన్నికల ముచ్చట్లు’ పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇంటర్ నోడల్ అధికారి షేక్సలాం, సదాశివనగర్ ప్రిన్సిపల్ అజ్మల్ఖాన్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ యూనియన్ నాయకులు బొర్ర రాజాగౌడ్, రజాక్, మనోహర్, రాజు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి.