కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ
ప్రసంగిస్తున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ, పక్కన అర్వింద్
ఈనాడు, నిజామాబాద్ : కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజామాబాద్ వచ్చిన ఆయన, అనంతరం జరిగిన విజయ సంకల్ప్ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో అనేక కుంభకోణాలు జరిగాయని..అవినీతి లేకుండా పాలన సాగిస్తున్న భాజపాపై రాజకీయ దాడి చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించిన ఆ పార్టీ, భారాసతో లోపాయికారి ఒప్పందంలో భాగంగా మెత్తపడిందన్నారు. మోదీ పదేళ్ల పాలనలో 50 కోట్ల మంది దారిద్య్రరేఖను దాటి బయటకు వచ్చారన్నారు. అన్నివర్గాల సంక్షేమమే తమ విధానమన్నారు. ఈ ప్రాంత రైతులు 40 ఏళ్లుగా చేస్తున్న పసుపుబోర్డు పోరాటాన్ని మోదీ అర్థం చేసుకొని ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారన్నారు. చక్కెర కర్మాగారాల అంశాన్ని స్థానిక ఎంపీ అర్వింద్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారన్నారు. ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని పేర్కొన్నారు.
ఇందూరు గడ్డమీదే పసుపుబోర్డు
పసుపు బోర్డు ఇందూరు గడ్డ మీద ఏర్పాటు చేసే బాధ్యత తనదేనని ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. సభలో ఆయన ప్రసంగిస్తూ గత ఎన్నికల సమయంలో తానిచ్చిన అన్ని హామీలను నెరవేర్చానని చెప్పారు. మాధవనగర్ రైల్వే వంతెన సహా.. మరో ఆరు వంతెనల నిర్మాణం కోసం కృషి చేసినట్లు చెప్పారు. రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు అంశం ప్రస్తావించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన జీవన్రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి ఈ ప్రాంతానికి ఒక్కసారి కూడా రాలేదని విమర్శించారు. పట్టభద్రుల ఓట్లతో గెలిచి.. ఉద్యోగాల భర్తీ, పోటీ పరీక్షల లీకేజీ అంశాలపై పోరాడలేదన్నారు. జీవన్రెడ్డి కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాక పసుపు బోర్డు తెస్తారని రేవంత్రెడ్డి చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పసుపు బోర్డు అంశం వ్యవసాయ శాఖ పరిధిలో ఉండదని... అది వాణిజ్యశాఖ పరిధిలో ఉంటుందని కాంగ్రెస్ నేతలకు తెలియదని ఎద్దేవా చేశారు. గల్ఫ్ బాధితుల కష్టాలు కాంగ్రెస్, భారాస ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. భాజపా అనుబంధ సంస్థ ఇండియా పీపుల్స్ ఫారం గల్ఫ్లో చిక్కుకుపోయిన భారతీయులకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోతో హిందువుల్లో అభద్రత సృష్టిస్తోందని ఆరోపించారు. కేవలం మైనార్టీలను మాత్రమే ప్రోత్సహించేలా హామీలు ఇవ్వడం ఓటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. చక్కెర పరిశ్రమను వచ్చే ఏడాది డిసెంబరు కల్లా తెరుస్తామని ప్రభుత్వం నియమించిన కమిటీ అంటుంటే.. ఈ సెప్టెంబరులోనే తెరుస్తామని రేవంత్రెడ్డి చెప్పటం నమ్మశక్యంగా లేదన్నారు. మోదీ హయాంలో రైల్వే లైన్లు, జాతీయ రహదారులు ఎంతో అభివృద్ధి చెందాయని.. రానున్న రోజుల్లో మరింత ప్రగతిని సాధిస్తామని చెప్పారు. జక్రాన్పల్లిలో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు.
వేదికపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్,
ఎంపీ ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్, రాకేశ్రెడ్డి, నాయకులు పల్లె గంగారెడ్డి, మోహన్రెడ్డి, బోగ శ్రావణి, మేడపాటి ప్రకాశ్రెడ్డి తదితరులు
ఇతర మతాల దేవుళ్లపై ప్రమాణం చేయాలి
ఇచ్చిన హామీలు అమలు చేయమంటే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హిందూ దేవుళ్లపై ప్రమాణం(ఒట్టు) వేస్తున్నారని ఎమ్మెల్యే రాకేష్రెడ్డి పేర్కొన్నారు. ఆయనకు ధైర్యం ఉంటే ఇతర మతాల దేవుళ్లపై ఒట్లు వేయాలన్నారు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దామన్నారు. అమాయక హిందువులను మోసం చేయటం కోసం కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి ఒట్లు వేస్తున్నారన్నారు. ఓట్ల కోసం అందరూ కాషాయ వస్త్రాలు ధరిస్తున్నారని.. కానీ హిందుత్వం అనేది గుండెల్లో ఉండాలన్నారు. అయోధ్య బాలరాముడిని మదిలో తలుచుకుంటూ.. భాజపాకు ఓటు వేయాలన్నారు.
హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం
ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విమర్శించారు. రుణమాఫీ ఆగస్టు 15కు వాయిదా వేయటమంటే.. అప్పటికల్లా పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలు ముగుస్తాయనే దురాలోచనతో చేస్తున్న పనిగా పేర్కొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భాజపా బలంగా ఉందని.. ఇక్కడ అత్యధిక మెజార్టీతో అర్వింద్ గెలవటం ఖాయమన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్కు ధర్మం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. బహిరంగ సభలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఉత్తరాఖండ్ మంత్రి వినయ్ రోహెలా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, వెంకటరమణి, పార్టీ నిజామాబాద్, జగిత్యాల జిల్లాల అధ్యక్షులు దినేష్ కులాచారి, సత్యనారాయణ, నాయకులు మేడపాటి ప్రకాష్రెడ్డి, వడ్డి మోహన్రెడ్డి, లోక భూపతిరెడ్డి, గద్దె భూమన్న, భోగా శ్రావణి, స్రవంతిరెడ్డి, మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు.
బహిరంగ సభకు హాజరైన ప్రజలు, కార్యకర్తలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో భారీగా చేరికలు
[ 05-05-2024]
రామారెడ్డి భారాస గ్రామ మాజీ యువజన అధ్యక్షుడు బండి ప్రవీణ్.. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. -
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వడగళ్ల వాన
[ 05-05-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో వడగళ్ల వాన పడుతోంది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. -
పెండింగ్ బిల్లులు ఇప్పిస్తాం
[ 05-05-2024]
ఇల్లు కట్టుకుని బిల్లులు రాని వారికి పెండింగ్లో ఉన్న బిల్లులు ఇప్పిస్తామని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. -
భాజపాతోనే దేశాభివృద్ధి
[ 05-05-2024]
భాజపాతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని భాజపా రాష్ట్ర ఉపాద్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. -
వ్యక్తి అదృశ్యం
[ 05-05-2024]
బీర్కూర్కు చెందిన టేకు మహేష్ (30) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై రాజశేఖర్ ఆదివారం తెలిపారు. -
కొనసాగుతున్న భారాస ఎన్నికల ప్రచారం
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ భారాస అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు ఓటు వేసి భారీ మెజారీటీతో గెలిపించాలని జడ్పీటీసీ మనోహర్ రెడ్డి అన్నారు. -
83 యూనిట్ల రక్త సేకరణ
[ 05-05-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో సమాజ సేవకులు, ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తశిబిరం విజయవంతం అయింది. -
మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యం
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భాజపా మండలంలో ప్రచారం ఉద్ధృతం చేసింది. -
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తాండూరు, అక్కంపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. -
పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలి
[ 05-05-2024]
ఓటింగ్ శాతం పెంపునకు అధికారులు కృషి చేయాలని జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్ జి తివారి అన్నారు. -
పార్టీ నిర్ణయాలకు కార్యకర్తలు కట్టుబడి ఉండాలి
[ 05-05-2024]
పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ అన్నారు. -
ఏ సామాజిక వర్గం ఎటు వైపో..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. జహీరాబాద్ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
వేధింపుల కట్టడికి అంతర్గత కమిటీలు
[ 05-05-2024]
పురపాలక కార్యాలయాల్లో, పని ప్రదేశంలో లైంగిక వేధింపులను నియంత్రించడానికి అంతర్గత కమిటీల ఏర్పాటుకు ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇందూరు భగభగ
[ 05-05-2024]
ఇందూరులో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. మే ఆరంభంలోనే ఎండ ప్రచండమైంది. జిల్లాలో మూడు ప్రాంతాలు రెడ్ జోన్లోకి వెళ్లాయి. -
శతశాతంతో శెభాష్ అనిపించారు
[ 05-05-2024]
ఇటీవల విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జంగంపల్లి మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థులు 10 జీపీఏతో సత్తా చాటారు. -
పల్లెలపైనే పార్టీల ఆశలు
[ 05-05-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానంలో పాగావేసేందుకు భారాస, కాంగ్రెస్, భాజపా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల ప్రచారసరళిని గమనిస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రచారం సాగిస్తున్నాయి. -
దోస్త్కు వేళాయె..!
[ 05-05-2024]
డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచి తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. -
బిల్లులు ఇవ్వకుంటే ధర్నా చేస్తా
[ 05-05-2024]
పెండింగ్లో ఉన్న రెండు పడకగదుల ఇళ్ల బిల్లులు రూ.26 కోట్లు ఇవ్వకుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల తర్వాత కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
‘జిల్లాను రద్దు చేస్తే ఊరుకునేది లేదు’
[ 05-05-2024]
కొత్తగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రద్దు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు. -
‘370 సీట్లతో భాజపా మూడోసారి అధికారంలోకి’
[ 05-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 370 సీట్లతో మూడోసారి కేంద్రంలో భాజపా అధికారం చేపట్టనుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
పోలీసుల అదుపులో నిందితులు..!
[ 05-05-2024]
భిక్కనూరు పోలీస్స్టేషన్ పరిధిలో నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తున్న నలుగురు నిందితులను ప్రత్యేక పోలీసు బృందం శనివారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
పట్టపగలే దొంగలు పడ్డారు
[ 05-05-2024]
నాలుగో ఠాణా పరిధిలో పట్టపగలే చోరీ కలకలం రేపింది. అరగంట వ్యవధిలోనే ఇల్లు గుల్లచేశారు. వివరాల్లోకి వెళ్తే వినాయక్నగర్ తుల్జా భవానీ మందిరం సమీపంలో మధుసూదన్ తన కుటుంబ సభ్యులతో శనివారం మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. -
పరీక్ష రుసుము చెల్లింపునకు అవకాశం
[ 05-05-2024]
డా బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో 2017 విద్యా సంవత్సరానికి ముందు డిగ్రీలో ప్రవేశం పొందిన, పునఃప్రవేశం పొందిన విద్యార్థులు బ్యాక్లాగ్ పరీక్ష రుసుము కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్రెడ్డి, అధ్యయన కేంద్రం ప్రాంతీయ సమన్వయకర్త రంజిత శనివారం ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము రూ.200తో ఈ నెల 6 వరకు, రూ.500తో 13 వరకు అవకాశం ఉందన్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
-
లఖ్నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్