మంత్రి, ఎమ్మెల్యేలుగా పనిచేసి..జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికై..
సాధారణంగా రాజకీయ నాయకులు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత పదవులు అధిరోహిస్తుంటారు. ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చేరి ఉన్నత పదవి చేపట్టాలని కలలు కంటూ ఉంటారు
న్యూస్టుడే, కామారెడ్డి కలెక్టరేట్: సాధారణంగా రాజకీయ నాయకులు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత పదవులు అధిరోహిస్తుంటారు. ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చేరి ఉన్నత పదవి చేపట్టాలని కలలు కంటూ ఉంటారు. కాని ఉమ్మడి జిల్లాలో ఇద్దరు నాయకులు మాత్రం ఉన్నత పదవులు చేపట్టిన తర్వాత పార్టీ ఆదేశానుసారం చిన్న పదవులకు కూడా పోటీ చేసి నెగ్గారు. వారెవరో కాదు ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి శనిగరం సంతోష్రెడ్డి, బోధన్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్త రమాకాంత్.
జిల్లా పరిషత్ ఛైర్మన్గా..
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన శనిగరం సంతోష్రెడ్డి అప్పటికే రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ను వదిలి తెరాసలో చేరారు. కేసీఆర్తో కలిసి పార్టీకి సేవలందించారు. 2001-2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెదేపా ప్రభుత్వం ఉంది. అదే ఏడాది జిల్లా పరిషత్ ఎన్నికల ప్రకటన వచ్చింది. క్షేత్రస్థాయిలో తెదేపా బలంగా ఉండే రోజులవి. కేసీఆర్ ఆదేశాల మేరకు సంతోష్రెడ్డి ఆర్మూర్ జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేయాల్సి వచ్చింది. తెరాస జడ్పీటీసీ సభ్యులు అధికంగా గెలిస్తే సంతోష్రెడ్డినే జడ్పీఛైర్మన్గా ఎంపిక చేస్తామని కేసీఆర్ ప్రకటించాడు. దీంతో ఆర్మూర్ మండలం నుంచి సంతోష్రెడ్డి సునాయసంగా విజయం సాధించాడు. జిల్లావ్యాప్తంగా తెరాస ప్రభంజనం సృష్టించింది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ముందే అనుకున్నట్లు సంతోష్రెడ్డి నిజామాబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్గా ఎన్నికయ్యాడు. 2004లో ఆర్మూర్ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
గెలిచి.. రాజీనామా చేసి..
బోధన్ నియోజకవర్గంలో తెదేపా నుంచి 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు కొత్త రమాకాంత్. 1994 వరకు పదవిలో కొనసాగాడు. ఆ తర్వాత అవకాశాల కోసం ఎదురుచూస్తున్న రమాకాంత్ను తెదేపా అధిష్ఠానం బోధన్ మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయించింది. జిల్లాలో అత్యధిక స్థానాలు వస్తే రమాకాంత్ను జిల్లా పరిషత్ ఛైర్మన్గా ఎంపిక చేస్తామని పార్టీ పెద్దలు భావించారు. అయితే ఆ ఎన్నికల్లో బోధన్ నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించిన రమాకాంత్ తర్వాత పదవికి రాజీనామా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్లో చేరికలు
[ 27-04-2024]
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో మత్తమాల్, కొక్కొండ వివిధ పార్టీలకు చెందిన నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ వార్డు కమిటీ ఎన్నిక
[ 27-04-2024]
ఎల్లారెడ్డి పురపాలక 11వ వార్డు లింగరెడ్డిపేట కాంగ్రెస్ నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్ తెలిపారు, -
గడప గడపకు కాంగ్రెస్
[ 27-04-2024]
మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెత్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు శనివారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్