నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే తాటిపర్తి జీవన్రెడ్డిని బరిలోకి దింపనుంది. ఈయన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం బుధవారం రాత్రి ఖరారు చేసింది.
సీనియర్ వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు
ఈనాడు, నిజామాబాద్, న్యూస్టుడే, జగిత్యాల
నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే తాటిపర్తి జీవన్రెడ్డిని బరిలోకి దింపనుంది. ఈయన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం బుధవారం రాత్రి ఖరారు చేసింది. ఆయన ప్రస్తుతం నిజామాబాద్-ఆదిలాబాద్- ఖమ్మం, ఉమ్మడి మెదక్ జిల్లా పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన, నవంబరులో నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. కానీ, పార్టీలో అనుభవం గల నాయకుడిగా ఉండటంతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి నిలపాలని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయించింది. మొదటి జాబితా సందర్భంలోనే నిర్ణయం జరిగినప్పటికీ.. సీట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాల అంశం చర్చకు రావటంతో ప్రకటన ఆలస్యమైంది. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించుతూ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సూచించిన పేరునే ఖరారు చేసింది.
సమితి అధ్యక్షుడి నుంచి మంత్రి వరకు..
పాఠశాల విద్య ఉమ్మడి కరీంనగర్లోనే పూర్తి చేసిన జీవన్రెడ్డి, హైదరాబాద్లో బీఏ, ఎల్ఎల్బీ చదివారు. 1981లో మల్యాల సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1983లో తొలిసారిగా తెదేపా నుంచి జగిత్యాల శాసనసభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆబ్కారీశాఖ మంత్రిగా పనిచేశారు. 1985లో కాంగ్రెస్లో చేరారు. పదకొండు సార్లు శాసనసభకు పోటీ చేసి ఆరుసార్లు గెలుపొందారు. లోక్సభ స్థానానికి ఆయన పోటీ చేయటం ఇది మూడోసారి. 2006, 2008లో కరీంనగర్ లోక్సభ స్థానానికి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో భారాస అధ్యక్షుడు కేసీఆర్ చేతిలో ఓటమి చెందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రోడ్లు-భవనాలశాఖ మంత్రిగా పనిచేశారు.
ముగ్గురు ఒకే తీరున...
భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు వేర్వేరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఇలా ముగ్గురు ఒకే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయి.. ఒకే లోక్సభ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలోకి దిగుతుండటం గమనార్హం.
ఇక ప్రచార బాట
భాజపా, భారాస నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. ధర్మపురి అర్వింద్ గత నెలలోనే ప్రచారం ప్రారంభించగా.. ఇటీవల భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తన ప్రచారాన్ని జగిత్యాల జిల్లా నుంచి మొదలుపెట్టారు. అభ్యర్థిగా ఖరారు కాకముందే జీవన్రెడ్డి.. జగిత్యాల జిల్లాలో పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేశారు. జీవన్రెడ్డి 30వ తేదీన నిజామాబాద్లో పర్యటించనున్నారు. ఆయన ఇప్పటికే నిజామాబాద్లో ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు. తాజాగా కాంగ్రెస్ పేరు ఖరారు కావటంతో ఇక మూడు పార్టీల అభ్యర్థుల ప్రచారం ఊపందుకోనుంది. భాజపా ఇప్పటికే నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశాలు ప్రారంభించింది. ఇదే తీరున మిగతా పార్టీలూ సమావేశాలు నిర్వహించే ఆలోచనతో ఉన్నాయి. ఇందుకోసం వ్యూహాలను పార్టీల పరంగా సిద్ధం చేస్తున్నప్పటికీ.. అభ్యర్థులు సొంతంగా ప్రణాళికలు రచించారు. ఎన్నికలకు ఇంకా గడువు ఉండటంతో నింపాదిగా..ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ పర్యటించాలని నిర్ణయించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడప గడపకు కాంగ్రెస్
[ 27-04-2024]
మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెత్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు శనివారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం