logo

భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక

జహీరాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ మహారాజుల మురళి ఆధ్వర్యంలో భాజపా మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

Published : 28 Mar 2024 16:30 IST

నాగిరెడ్డిపేట: జహీరాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ మహారాజుల మురళి ఆధ్వర్యంలో భాజపా మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, అసెంబ్లీ ఫుల్ టైమర్ అశోక్ హాజరై మండల అధ్యక్షుడిగా సత్యబోయిన శ్రీకాంత్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కృష్ణ, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా సుభాష్ ఏకగ్రీవంగా మండల నాయకుల సమక్షంలో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని