సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు.
ప్రధాన పార్టీల వ్యూహాలు
ఈనాడు, నిజామాబాద్
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. వీరంతా ప్రచారంలో ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. అవకాశం ఉన్న అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. ప్రభావం చూపే వర్గాలే లక్ష్యంగా హామీలిస్తున్నారు. తమ విధానాలు వివరిస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు పోటీ పడుతున్నారు. పార్టీల ముఖ్య నేతలు సభలకు వస్తుండటంతో ప్రచారం హోరెత్తుతోంది.
పరస్పరం పోటీపడుతూ..
పార్టీ శ్రేణులను సమాయత్తం చేయటంతో పాటు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. ఇదే క్రమంలో ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇందూరు ప్రజలు పెద్దఎత్తున భాగస్వాములవుతారు. ఈ సందర్భాన్ని నాయకులంతా తమకు చిక్కిన అవకాశంగా భావించి సద్వినియోగం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. సాధారణంగా ప్రత్యర్థులంతా వేర్వేరు చోట్ల తిరుగుతూ ప్రచారంలో పాల్గొంటారు. కానీ, మూడు పార్టీల అభ్యర్థులు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొని భక్తుల మధ్యే గడిపారు. చూసేవారికి స్వామికార్యం, స్వకార్యం రెండు ఒకేచోట అన్నట్లుగా కనిపించటం విశేషం.
సభలతో ఉత్సాహం..
నిజామాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఓటర్లకు హామీలు ఇవ్వడంతో పాటు సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని శ్రేణులకు సూచించారు. ఆ పార్టీ నాయకులు ప్రచార ఘట్టంలో ఉత్సాహంగా కదులుతున్నారు. భారాస సైతం నామినేషన్ దాఖలు సందర్భంగా సభ నిర్వహించింది. ఈ సందర్భంలో హాజరైన నాయకులు ఉద్యమ కాలం నాటి ప్రసంగాలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. వీరంతా ప్రచారంలో భాగమవుతున్నారు. నియోజకవర్గంలో ముందస్తుగా ప్రచారం మొదలెట్టిన భాజపా, జగిత్యాలలో మోదీ సభను నిర్వహించింది. పార్టీ శ్రేణులు ఇప్పటికే ప్రచారంలో నిమగ్నమయ్యారు. రెండో విడతగా మరో ఎన్నికల సభను గురువారం నిజామాబాద్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సభకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హాజరవుతున్నారు. భారీ జనసమీకరణ చేయాలని భాజపా సన్నాహాలు చేస్తోంది.
ప్రభావిత వర్గాలను కలుస్తూ..
మూడు పార్టీల నేతలు ప్రభావం చూపే సామాజికవర్గాల పెద్దలను కలిసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. వీరి ఓట్లు పెద్దసంఖ్యలో ఉండటంతో తమ పార్టీకే వేసేలా సహకరించాలని కోరుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వివరిస్తూ.. ఎవరికి వారు తనకు అండగా నిలవాలని కోరుతున్నారు. సంప్రదింపుల సమయంలో హామీలూ ఇస్తున్నారు. వచ్చిన చిక్కాల్లా ఏంటంటే..కలుస్తున్న ప్రతి అభ్యర్థితో ఆయా వర్గాల పెద్దలు సానుకూలంగానే మాట్లాడి పంపిస్తున్నారు. చివరికి వీరు ఎటువైపు నిలుస్తారు? సామాజికవర్గం వాళ్లు వారు వీరి మాటకు కట్టుబడి ఓట్లు వేస్తారా? అనే సందేహాలు నాయకుల్లోనూ వ్యక్తమవుతుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా
[ 04-05-2024]
తనను ఎంపీగా గెలిపిస్తే జాబ్ మేళా ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని జహీరాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. -
సీఎం ప్రజలను మోసం చేస్తున్నారు: పోచారం
[ 04-05-2024]
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను దర్శించుకుంటూ అక్కడున్న దేవుళ్లపై ఒట్లు పెడ్తు ప్రజల్ని మోసం చేస్తున్నారని మాజీ సభాపతి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. -
అంబేడ్కర్ దూరవిద్య పరీక్ష రుసుం చెల్లించాలి
[ 04-05-2024]
అంబేడ్కర్ దూరవిద్యలో డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్ పరీక్ష రుసుంను ఈ నెల 6వ తేదీలోగా చెల్లించాలని కామారెడ్డి అధ్యయన కేంద్ర సమన్వయకర్త రాజ్కుమార్ తెలిపారు. -
చిగురింతలు పుస్తకావిష్కరణ
[ 04-05-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రముఖ కవి, చిత్రకారుడు చింతల శ్రీనివాస గుప్తా రాసిన చిగురింతలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
ఈవీఎంల పనితీరుపై ఆరా
[ 04-05-2024]
ఈ నెల 13న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్ జి తివారి ఆదేశించారు. -
అమ్మ ఆదర్శ బడుల్లో వసతులపై దృష్టి
[ 04-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. -
హనుమాన్ చాలీసా పారాయణ్ వార్షికోత్సవ సమ్మేళనం
[ 04-05-2024]
హిందూ వాహిని ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణ్ వార్షికోత్సవ సమ్మేళనం కామారెడ్డిలోని ధర్మశాలలో శనివారం నిర్వహించారు. -
భారీ మెజారిటీతో గెలిపించాలి
[ 04-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పల్లె పొగడ తాండ, బొల్లారం గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. -
గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి
[ 04-05-2024]
ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఓ కూలీ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన మండలంలోని జప్తి జాన్కంపల్లి గ్రామంలో జరిగింది. -
నీటి సరఫరాకు అంతరాయం తలెత్తొద్దు
[ 04-05-2024]
వేసవి నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తకుండా చూడాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేకాధికారి శరత్ తెలిపారు. -
ప్రాంగణాలు.. బేజారు..!
[ 04-05-2024]
మహాలక్ష్మి పథకం నేపథ్యంలో ప్రాంగణాల్లో రద్దీ పెరిగింది. ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా భావించే ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మాత్రం మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతోంది. -
మాతృభాషలో తడబాటు
[ 04-05-2024]
తన తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారి నుంచి ఏ భాష వింటూ, ఇబ్బంది లేకుండా తన్మయత్వంతో నేర్చుకుంటున్నారో అందులోనే మందగమనం మొదలైంది. -
వజ్రాయుధాన్ని వదులుకోవద్దు!
[ 04-05-2024]
ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్య పరిరక్షణకు వజ్రాయుధం. ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటూ ఎన్నికల అధికారులు ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు. -
ఇంటి నుంచే ఓటు ప్రారంభం
[ 04-05-2024]
అర్బన్ నియోజకవర్గంలో ఇంటి నుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారి కోసం ఓటు వేసే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
[ 04-05-2024]
కాంగ్రెస్తోనే అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
‘చక్కెర పరిశ్రమపై హస్తం పార్టీ డ్రామా’
[ 04-05-2024]
చక్కెర పరిశ్రమపై రైతులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ డ్రామా అడుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు -
స్వతంత్రులు నామమాత్రమేనా..?
[ 04-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీచేస్తున్నా కనీస ప్రభావం చూపలేకపోతున్నారు. -
ఓటింగ్ శాతంపెంపునకు ప్రాధాన్యం
[ 04-05-2024]
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది. -
‘భాజపాతోనే అభివృద్ధి సాధ్యం’
[ 04-05-2024]
ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
‘పదేళ్లలో చేసిందేమీ లేదు’
[ 04-05-2024]
పదేళ్లలో ఎంపీ బీబీపాటిల్ బాన్సువాడ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీలేదని జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ అన్నారు. -
నిర్భయంగా ఓటేయాలి
[ 04-05-2024]
నిర్భయంగా ఓటేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాల ఆవరణలోని సెల్ఫీపాయింట్ వద్ద శుక్రవారం స్వీయ చిత్రం దిగారు. -
ఎవరికెంత మెజార్టీ అంటే..!
[ 04-05-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఇప్పటివరకు 17 ఎన్నికలు జరిగాయి. -
ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు
[ 04-05-2024]
కాస్బాగ్ తండా వెనుక ప్రాంతంలో ఉన్న పోతుల మోరి వాగు చెక్డ్యామ్ వద్ద ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేసి వ్యాపారులు రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. -
‘భాజపాను గద్దెదించాలి’
[ 04-05-2024]
ప్రజా సంక్షేమం, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్న భాజపాను గద్దెదించాలని జాగో తెలంగాణ కన్వీనర్ ఆకునూరి మురళి పేర్కొన్నారు. -
‘గల్ఫ్ కార్మికుల ప్రశ్నలకు అర్వింద్ సమాధానాలు ఇవ్వాలి’
[ 04-05-2024]
గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగేముందు నిజామాబాద్ ఎంపీ అర్వింద్.. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ మంద భీమ్రెడ్డి డిమాండ్ చేశారు. -
పురపాలికలకు ముందస్తు ఆదాయం
[ 04-05-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పురపాలికలకు ‘ముందస్తు’ ఆదాయం వచ్చింది. -
ఓట్లతోనే జాతీయ, ప్రాంతీయ పార్టీల గుర్తింపు
[ 04-05-2024]
జాతీయ, ప్రాంతీయ పార్టీలు అని తరచూ వింటూ ఉంటాం. జాతీయ పార్టీలు దిల్లీ కేంద్రంగా, ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల రాజధానుల కేంద్రంగా పనిచేస్తాయి. -
ఎన్నికల సహాయకేంద్రంలో సీసీ వీరంగం..!
[ 04-05-2024]
కలెక్టరేట్ కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి వద్ద సీసీగా పనిచేస్తున్న వ్యక్తి గురువారం రాత్రి కలెక్టరేట్లో వీరంగం సృష్టించినట్లు తెలిసింది.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?