పల్లెల్లో వేసవి క్రీడా శిబిరాలు
విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడానైపుణ్యాలకు పదునుపెట్టడానికి జిల్లాలో వేసవి క్రీడా శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణ ప్రకారం జిల్లాలో మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శిబిరాలను కొనసాగించనున్నారు.
జిల్లాలో 11 కేంద్రాల ఏర్పాటు
మే 1 నుంచి 31 వరకు శిక్షణ
కామారెడ్డి క్రీడావిభాగం, న్యూస్టుడే: విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడానైపుణ్యాలకు పదునుపెట్టడానికి జిల్లాలో వేసవి క్రీడా శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణ ప్రకారం జిల్లాలో మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శిబిరాలను కొనసాగించనున్నారు. జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో శిక్షకులను ఎంపిక చేశారు. దీంతో వేసవి సెలవుల్లో ఖాళీగా ఉండే విద్యార్థులు వారికి ఇష్టమైన క్రీడలో నెల రోజుల పాటు నైపుణ్యం సాధించవచ్చు. శిక్షకులకు క్రీడా సామగ్రికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 11 శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.
నిర్వహణకు నిధులు మంజూరు
శిబిరాల నిర్వహణ కోసం ప్రభుత్వం జిల్లాకు నిధులు మంజూరు చేసింది. ఇందులో క్రీడా పరికరాల కోసం రూ.50 వేలు ఖర్చు చేస్తారు. ఒక్కో శిక్షకుడికి నెలకు రూ.4 వేలు గౌరవ వేతనం అందజేస్తారు. ఈ లెక్కన 11 కేంద్రాలకు రూ.44 వేలు ఖర్చవుతుంది. నిర్వహణ ఖర్చులకు రూ.6 వేలు, ప్రథమ చికిత్స కిట్కు రూ.5 వేల చొప్పున నిధులు వెచ్చించాలని అధికారులు నిర్ణయించారు. నెల రోజుల పాటు కొనసాగే క్రీడల నిర్వహణ పక్కాగా నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. క్రీడా శిబిరాల నిర్వహణకు జిల్లా కలెక్టర్ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖ అధికారి నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తారు.
14 ఏళ్ల వారికే..
శిబిరాల్లో 14 ఏళ్ల బాలబాలికలకు మాత్రమే శిక్షణ ఇవ్వనున్నారు. ఈ వయస్సు విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. శిబిరాల్లో అన్ని ఆటలకు ప్రాధాన్యమిస్తున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో శిక్షణ ఉంటుంది. ప్రతి శిబిరంలో మెడికల్ కిట్, నీటి వసతి ఏర్పాటు చేయాలని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. చాలా చోట్ల క్రీడా శిబిరాలను ప్రారంభించి మధ్యలో వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు వీటి నిర్వహణపై దృష్టి సారిస్తే పల్లె క్రీడాకారులకు మేలు జరుగుతుంది. ఈ విషయమై యువజన సర్వీసులు, క్రీడల అధికారి దామోదర్రెడ్డి మాట్లాడుతూ క్రీడాశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు పంటకు జై
[ 21-05-2024]
తొలకరి రాగానే జూన్ మొదటి వారంలోనే పసుపు విత్తడం ఆరంభమవుతుంది. రైతులు ఇప్పటికే దుక్కిలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
మట్టి.. కనిపెట్టి
[ 21-05-2024]
ఎండాకాలం వచ్చిందంటే చాలు పొడి దుక్కుల సమయంలో మట్టి నమూనాలు సేకరించడం ఒక్కప్పుడు ఆనవాయితీగా ఉండేది. -
టెట్ ప్రారంభం
[ 21-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2024 రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. మొదటిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు దశల్లో జూన్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. -
చరిత్ర శిథిలం.. పాలకులూ.. పట్టించుకోరా..
[ 21-05-2024]
నిజాం పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఇందూరు ప్రస్థానం ప్రత్యేకమైంది. నాటి హైదరాబాద్ రాష్ట్రం భారత్లో విలీనమయ్యే వరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వీరులు ఎన్నో ఉద్యమాలు చేశారు. -
నాలుగు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి
[ 21-05-2024]
మరో నాలుగు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తిచేస్తామని పాలనాధికారి జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. -
ఫలితాలు మెరుగయ్యేనా..?
[ 21-05-2024]
ఇంటర్మీడియట్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా అట్టడుగుస్థాయికి పడిపోయింది. -
ఆరోగ్యశ్రీలో అడ్డదారులు
[ 21-05-2024]
ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త ఏడాదిన్నర క్రితం ఎడపల్లి పీహెచ్సీ వైద్యాధికారిగా ఉద్యోగం రావడంతో వెళ్లిపోయారు. మహబూబ్నగర్కు చెందిన జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ స్వప్నకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. -
సదరం స్లాట్.. ఇక నిరంతరం
[ 21-05-2024]
అర్హులైన దివ్యాంగులు తగిన ధ్రువపత్రాలతో ఎప్పుడైనా మీ-సేవా కేంద్రాల్లో సదరం స్లాట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఇప్పటి వరకు ప్రతి నెలా రెండు, నాలుగో వారాల్లో సదరం శిబిరాలను నిర్వహిస్తున్నారు. -
ఓపెన్ జిమ్ను సందర్శించిన బల్దియా ఛైర్పర్సన్
[ 21-05-2024]
జిల్లా కేంద్రంలోని గోదాంరోడ్డు-పాతబస్టాండు ప్రాంతంలోని ఓపెన్జిమ్ను పురపాలక ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ సోమవారం సందర్శించారు. -
ప్రగతి పరిశీలన..
[ 21-05-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతి పనులు, సంక్షేమ పథకాలు పల్లెల్లో ఏ విధంగా అమలవుతున్నాయనే దానిపై సమగ్ర సమాచారం సేకరించి నివేదిక రూపొందించే నిమిత్తం ఎంసీహెచ్ఆర్డీ యంత్రాంగం రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఐదు గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేపట్టాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు: స్వాతీ మాలీవాల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కాకాణి అవినీతిపై పెద్ద పుస్తకమే రాయొచ్చు: సోమిరెడ్డి
-
కొత్త ప్రధాన కోచ్ పదవి రేసులో ఫ్లెమింగ్.. జయవర్థెనె? అతడికే ఎక్కువ ఛాన్స్!
-
ఇద్దరు నడిరోడ్డుపై ప్రాణాలు కోల్పోతే.. 15 గంటల్లో బెయిలా..?
-
బోర్గ్ డ్రింకింగ్.. అమెరికా యువతను మత్తెక్కిస్తున్న కొత్త ట్రెండ్!