రాజకీయ సోదాలు
బరగఢ్ జిల్లాలోని పద్మపూర్ స్థానం నిలుపుకోవడానికి బిజద, భాజపా, కాంగ్రెస్ నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ పోరులో శంఖం, కమలం పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయన్న ఆరోపణలు పెరుగుతున్నాయి.
పద్మపూర్లో చర్చనీయాంశమైన రాజకీయాలు
‘బొట్టే కాదు... ఓటూ కావాలి’ బర్షా ప్రచారం
భువనేశ్వర్, న్యూస్టుడే: బరగఢ్ జిల్లాలోని పద్మపూర్ స్థానం నిలుపుకోవడానికి బిజద, భాజపా, కాంగ్రెస్ నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ పోరులో శంఖం, కమలం పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. సోమవారం కేంద్ర ఆదాయ పన్నుల శాఖ (ఐటీ) అధికారులు బిజదకు మద్దతుదారులైన ముగ్గురు ప్రముఖుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. దీనికి ప్రతీకారంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అధికారులు భాజపా మద్దతుదారులైన వస్త్ర వ్యాపారులు, పెట్రోలు పంపుల్లో సోదాలు చేపట్టారు. దీనికి నిరసనగా పద్మపూర్ వాణిజ్య సంఘం మంగళవారం వ్యాపార సంస్థలు, దుకాణాల మూసివేతకు నిర్ణయం తీసుకోగా, బరగఢ్ ఎస్పీ పర్మార్ స్మిత్ జోక్యంతో వాయిదా వేశారు. మరోవైపు సోమవారం రాత్రి భాజపా నేత దిలీప్ సేనాపతిని దుండగులు అపహరించారు. ఇది బిజద నేతల పనేనని పద్మపూర్ భాజపా అభ్యర్థి ప్రదీప్ పురోహిత్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఝార్బంద్ వద్ద మంగళవారం తెల్లవారుజామున దిలీప్ సేనాపతిని గుర్తించారు. పద్మపూర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బాలేశ్వర్ ఎంపీ ప్రతాప్ షడంగి కారును అటకాయించి పోలీసులు తనిఖీలు చేసిన సంఘటనను భాజపా పెద్దలు తీవ్రంగా పరిగణించారు. ఓటమి భయంతోనే అధికారంలో ఉన్న బిజద అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వారు ఆరోపించారు. నిత్యం రెండు పార్టీల నాయకులు ఎన్నికల సంఘం కార్యాలయంలో పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు.
వీధి సభలు.. రోడ్ షోలు..
పద్మపూర్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. బిజద అభ్యర్థి బర్షారాణి సింగ్ బరిహకు మద్దతుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీధి సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతలిక్కడ మకాం వేశారు. కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమార్, అశ్వినీ వైష్ణవ్లు భాజపా తరఫున ప్రచారం చేస్తున్నారు. మరో ఇద్దరు కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, బిశ్వేశ్వర టుడు, ఎంపీలు, ఇతర నాయకులు ప్రదీప్ పురోహిత్కు మద్దతుగా పాదయాత్రలు చేస్తూ ఓటర్లను కలుస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్, మాజీ మంత్రులు, ఇతర నాయకులు పార్టీ అభ్యర్థి సత్యభూషణ్ సాహు తరఫున ప్రచారం చేస్తున్నారు.
‘అవ్వా... నీ ఓటు నాకే...’ ఓ వృద్ధురాలిని అభ్యర్థిస్తున్న ప్రదీప్
మాకూ సమయం వస్తుంది..
భాజపా రాష్ట్ర కార్యదర్శి పృథ్వీరాజ్ హరిచందన్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... తమకూ సమయం వస్తుందని, బిజద పెద్దల అధికార దుర్వినియోగానికి సమాధానం చెబుతామని అన్నారు. పద్మపూర్లో పరాజయం తథ్యమని తెలిసిన బిజద నేతలు క్షీణ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
సోదాలు ప్రారంభించింది వారే
బిజద అధికార ప్రతినిధి శశిభూషణ్ బెహర, మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ పద్మపూర్లో సోదాలు ప్రారంభించింది భాజపా పెద్దలేనని ఆరోపించారు. అధ్వాన రాజకీయాలు చేస్తున్నవారు ఇతరులకు నీతులు చెబుతున్నారని, పద్మపూర్లో భాజపా ఓటమి తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలంతా చూస్తున్నారు
పీసీసీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్ మంగళవారం పద్మపూర్లో విలేకరులతో మాట్లాడుతూ... పద్మపూర్లో బిజద, భాజపాల దుర్వినియోగం, నాయకుల డ్రామాలు ప్రజలు చూస్తున్నారని, ఈ రెండు పార్టీలను తిప్పికొడతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సత్యభూషణ్ సాహును ఓటర్లు గెలిపిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్