logo

దంపతుల హత్య

కేంఝర్‌ జిల్లా బలని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లకర్ధ గ్రామంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దంపతులను తుపాకులతో కాల్చి చంపారు.

Published : 30 Nov 2022 02:08 IST

మంజులత మృతదేహం,  విగతజీవిగా లక్ష్మీధర ఆపాట్‌

కటక్‌, న్యూస్‌టుడే: కేంఝర్‌ జిల్లా బలని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లకర్ధ గ్రామంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దంపతులను తుపాకులతో కాల్చి చంపారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... లక్ష్మీధర ఆపాట్‌ (40)కు గ్రామంలో కిరాణా దుకాణం ఉంది. సోమవారం రాత్రి కొందరు దుండగులు సరకులు కొనుగోలు చేయడానికి వచ్చి లక్ష్మీధరతో గొడవపడ్డారు. తర్వాత లక్ష్మీధర్‌, ఆయన భార్య మంజులత (35)పై కాల్పులు జరిపి పరారయ్యారు. కాల్పుల శబ్దం విని గ్రామస్థులు దుకాణం వద్దకు వెళ్లి గాయాలతో పడి ఉన్న దంపతులను వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ప్రకటించారు. సమాచారం అందుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మీధరకు గుండెలోకి, మంజులత పొట్టలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. మంగళవారం శవాల పంచనామా జరిపి గ్రామానికి తీసుకొచ్చారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ దంపతులకు పదేళ్ల కుమారుడు ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని