కొత్తపద్దుపై కోటి ఆశలు
బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక సర్వే పార్లమెంట్ సభ్యుల ముందుంచారు.
ప్రముఖులు, సామాన్యుల అభిప్రాయాలు వెల్లడి
భువనేశ్వర్, న్యూస్టుడే: బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక సర్వే పార్లమెంట్ సభ్యుల ముందుంచారు. బుధవారం దిగువ సభలో 2023-24 ఆర్థిక పద్దును ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మండుతున్న ధరలు, ఉపాధి అవకాశాలు, పన్నులు, వేతన జీవుల ఇబ్బందులపై సానుకూల నిర్ణయాలు ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.
ఆశాభావం..
కేంద్ర బడ్జెట్పై రాష్ట్ర పాలకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల కాలంలో కేంద్రం రాష్ట్రానికి చేయాల్సిన కేటాయింపుల్లో కోత విధించిందన్న విమర్శలున్నాయి. ఆర్థికంగా వెనకబడిన ఒడిశాకు 90:10 నిష్పత్తిలో నిధులు విడుదల చేయాలని నేతలు ఎంతో కాలంగా కోరుతున్నారు. దీంతోపాటు ప్రత్యేక హోదా డిమాండ్ ఉంది. రైల్వే, రహదారుల విస్తరణ, ఓడరేవులు, ఎయిర్ కనెక్టివిటీ, ఇతర మౌలిక వసతుల పట్ల వరాల జల్లు కురిపించాలని, ఐఐటీ, ఐజర్, ఐఐఎం, వైద్య విద్యా సంస్థల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంతోపాటు ఎంఎస్ఎంఈ రంగానికి చేయూతనిచ్చి అంకుర సంస్థలను ప్రోత్సహించే విధంగా బడ్జెట్ ఉండాలని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమివ్వాలి
ఆర్థికశాఖ మాజీ మంత్రి పంచానన్ కానుంగో విలేకరులతో మాట్లాడుతూ.. అభివృద్ధి పనులకు రాజకీయాలతో ముడిపెట్టకుండా కేంద్రం రాష్ట్రానికి న్యాయం చేయాల్సి అవసరం ఉందన్నారు. ఉపాధి అవకాశాలు, నిర్మాణ రంగానికి ప్రాధాన్యమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలి
బిజద నేత ఎం.చంద్రశేఖర్ ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ... నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని, వారిలో నైరాశ్యం కనిపిస్తోందని, ఉద్యోగ అవకాశాలపై కేంద్రం దృష్టిపెడితే మంచి నిర్ణయమవుతుందన్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలన్నారు.
దేశంలో ఉత్పత్తులు పెరగాలి
భాజపా నాయకుడు పొంచు బెహర మాట్లాడుతూ... విదేశాల నుంచి దిగుమతులు తగ్గించి, దేశంలో ఉత్పత్తి పెంచాలని జనాకర్ష పథకాలతో పాటు ఉపాధి కల్పనకు పెద్ద పీట వేయాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్