logo

కేజ్రీవాల్‌పై కుట్ర పన్నారు

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై కుట్ర పన్ని, తప్పుడు కేసులో అరెస్టు చేసి, అన్యాయంగా జైల్లో పెట్టారని ఆప్‌ నాయకులు ఆరోపించారు.

Published : 28 Mar 2024 04:26 IST

విలేకరుల సమావేశంలో పాల్గొన్న ‘ఆప్‌’ గంజాం జిల్లా నాయకులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై కుట్ర పన్ని, తప్పుడు కేసులో అరెస్టు చేసి, అన్యాయంగా జైల్లో పెట్టారని ఆప్‌ నాయకులు ఆరోపించారు. పార్టీ గంజాం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక గొల్లపల్లిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఇందులో ఆప్‌ నాయకులు సుభాష్‌ రౌత్‌, ఆదిత్యనారాయణ రథ్‌, సి.హరప్రసాద్‌, జె.దినేష్‌, నిరంజన్‌ పాత్ర్‌ తదితరులు మాట్లాడారు. భాజపా కుట్ర పన్ని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ద్వారా తప్పుడు కేసుల్లో ఇరికించిందని వారు ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా గురువారం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు జరుపుతామని వారు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని