మంత్రి సరకపై పోలీసులకు ఫిర్యాదు
హ్యాట్రిక్ విజయాలపై కన్నేసిన రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమ శాఖ మంత్రి జగన్నాథ సరకకు సొంత నియోజకవర్గంలో చుక్కెదురైంది.
తాగునీటి కోసం ప్రశ్నిస్తే అనుచరులతో దాడి చేశారంటూ ఆరోపణ
రఘుబారి గ్రామంలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన
రాయగడ పట్టణం, న్యూస్టుడే: హ్యాట్రిక్ విజయాలపై కన్నేసిన రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమ శాఖ మంత్రి జగన్నాథ సరకకు సొంత నియోజకవర్గంలో చుక్కెదురైంది. నియోజకర్గ పరిధిలో రఘుబారి గ్రామానికి ప్రచారం కోసం వెళ్లిన ఆయనకు గ్రామంలోని తాగునీటి సమస్యను తెలియజేసేందుకు మహిళలు ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు. దీనిని సహించలేని మంత్రి అనుచరులు గ్రామస్థులపై దాడికి దిగడంతో కథ అడ్డం తిరిగింది. వివరాల్లోకి వెళితే... బిసంకటక్ సమితి రఘుబారి గ్రామానికి మంత్రి సరక ఆదివారం ప్రచారానికి వెళ్లారు. ఏడాదిగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా తమ గ్రామంవైపు కన్నెత్తి చూడని మంత్రి ఇప్పుడు ఓట్ల కోసం ఎలా వచ్చారని గ్రామస్థులు ప్రశ్నించారు. తమ సమస్య ఆయనకు తెలియజేసేలా మహిళలు ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. ఈ క్రమంలో గ్రామస్థులకు, మంత్రి అనుచరులకు వాగ్వాదం చోటు చేసుకోగా, సహనం కోల్పోయిన మంత్రి అనుచరులు తమపై దాడికి పాల్పడి, దుర్భాషలాడారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సరక అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన వెంట ఉన్న బిజద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సుధీర్ దాస్ గ్రామస్థులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
కేసులు నమోదు
ఈ ఘటనకు సంబంధించి అంబోదల పోలీస్ స్టేషన్లో ఇరువర్గాల వారు సోమవారం పరస్పరం కేసులు పెట్టుకున్నారు. మంత్రి సరక, సుధీర్దాస్ అనుచరులు తమను దుర్భాషలాడుతూ, గ్రామానికి చెందిన కొందరు యువకులపై చేయిచేసుకున్నారని ఆరోపిస్తూ హరకృష్ణ బెహరా, హరేంద్ర గౌడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామస్థులు తమతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ మంత్రి అనుచరులు ఫిర్యాదు చేయడం గమనార్హం. గ్రామానికి చెందిన రఘునాథ్ అనే వ్యక్తి మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సమస్యల గురించి మంత్రిని ప్రశ్నించామని, దీంతో వారి అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. చంచల బెహరా అనే మహిళ మాట్లాడుతూ మంత్రి దృష్టికి సమస్య తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఖాళీ బిందెలతో నిరసన తెలపగా ఆయన వెంట వచ్చిన వ్యక్తులు దుర్భాషలాడారన్నారు. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కొందరు యువకులపై వారు దాడికి పాల్పడినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సుధీర్ దాస్ మాట్లాడుతూ ఇదంతా ప్రతిపక్షాల రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలహండి... ఎవరిదో విజయమండీ ?
[ 30-04-2024]
పశ్చిమ ఒడిశాలోని కలహండి లోక్సభ స్థానంలో విజేత ఎవరు? ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారు? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిజద, భాజపా, కాంగ్రెస్ నాయకత్వాలు ఈసారి కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చాయి. విజయానికి ఇక్కడ కొన్ని కులాలు నిర్ణయాత్మకమవుతున్నాయి. -
నేడు నవీన్ నామినేషన్
[ 30-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం గంజాం జిల్లాలోని హింజిలి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
సంబల్పూర్ నుంచి నాగేంద్ర... కటక్కు సురేష్
[ 30-04-2024]
సంబల్పూర్ మాజీ ఎంపీ నాగేంద్ర ప్రధాన్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. కటక్ నుంచి సురేష్ మహాపాత్ర్ బరిలో దిగారు. -
పోటీకి నిలిచిన రోజు కూలీ, రాజ మేస్త్రీ
[ 30-04-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని భంజనగర్, అస్కా అసెంబ్లీ స్థానాలకు సీపీఐ (ఎంఎల్) రెడ్స్టార్ తరపున రోజు కూలీ, మరో రాజ మేస్త్రీ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
వర్ష బీభత్సం
[ 30-04-2024]
కొరాపుట్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం పెనుగాలులతో కూడిన భారీ వర్షం తీవ్ర నష్టాల్ని మిగిల్చింది. -
దక్షిణంలోనూ కమల వికాసం
[ 30-04-2024]
రాష్ట్రంలో రెండున్నర దశాబ్దాల బిజద పాలన చూసిన ప్రజలకు ఆ పార్టీపై వ్యతిరేకత ఉందని, భాజపాకు ఈసారి అవకాశం ఇవ్వాలన్న ధ్యేయంతో ఉన్నారని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా పేర్కొన్నారు. -
నిన్న నువ్వా, నేనా... నేడు నువ్వే నేను
[ 30-04-2024]
‘మేమిద్దరం ఈసారి సహోదరులం’ చేతులు కలిపిన ఇద్దరం బిజద లెక్క తేలుస్తాం, ప్రజలకు అండగా ఉంటాం. ఈ ప్రాంతాభివృద్ధికి కలసిమెలసి పని చేస్తాం’ అంటూ బ్రహ్మపుర భాజపా లోక్సభ అభ్యర్థి ప్రదీప్కుమార్ పాణిగ్రహి, గోపాల్పూర్ అసెంబ్లీ బరిలో ఉన్న బిభూతి భూషణ్ జెనా ప్రచారం చేస్తున్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
[ 30-04-2024]
బ్రహ్మపురలోని పురాతన సిటీ హైస్కూల్లో 1971 సంవత్సరం మెట్రిక్యులేషన్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సంఘం ఆత్మీయ సమావేశం ఆదివారం రాత్రి ఉత్సాహంగా జరిగింది. -
ఎన్నికల నిబంధన ఉల్లంఘన..
[ 30-04-2024]
గజపతి జిల్లాలో ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలు ప్రక్రియ ముగియకముందే ముఖ్యమంత్రి చిత్రాలతో పాటు రాష్ట్ర పథకాల ప్రచార హోర్డింగులు దర్శనమిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన