మాటల ముత్యాలు
దేశంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి...?, రాజకీయ, నైపుణ్య, సాంకేతికత తదితర అంశాలపై యువత ఏమనుకుంటోంది...? ఏం కోరుకుంటోంది...? వారేం చేయాలనుకుంటున్నారు..? ఏం చేస్తే బాగుంటుంది..? ఇలా యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘యూత్ పార్లమెంట్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
యూత్ పార్లమెంట్కు నలుగురి ఎంపిక
ఆన్లైన్లో అభ్యర్థుల ఉపన్యాసం వింటున్న న్యాయ నిర్ణేతలు
విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్టుడే: దేశంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి...?, రాజకీయ, నైపుణ్య, సాంకేతికత తదితర అంశాలపై యువత ఏమనుకుంటోంది...? ఏం కోరుకుంటోంది...? వారేం చేయాలనుకుంటున్నారు..? ఏం చేస్తే బాగుంటుంది..? ఇలా యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘యూత్ పార్లమెంట్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల నెహ్రూ యువ కేంద్రం(ఎన్వైకే) ప్రాంతీయ స్థాయిలో పోటీలు నిర్వహించగా ఉమ్మడి జిల్లాల నుంచి రాష్ట్రస్థాయికి నలుగురు అర్హత సాధించారు. వారేం అన్నారో తెలుసుకుందామా..
ఎంపిక ఇలా..
జిల్లాల వారీగా ఎంపిక చేసిన వారిని రాష్ట్రస్థాయికి, అక్కడి నుంచి జాతీయ స్థాయికి పంపించి పార్లమెంట్ భవన్లో ప్రసంగించే అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది మార్పుల్లో భాగంగా సుమారు ఆరు నుంచి ఏడు జిల్లాల వారిని ప్రాంతీయ విభాగంగా ఏర్పాటు చేశారు. గత నెల 27న విజయనగరం శాఖకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇందులో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 70 మందికి వర్చువల్ విధానంలో పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాల నుంచి నలుగురు రాష్ట్రస్థాయికి అర్హత సాధించారు. ఆ పోటీల వేదిక, నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటించనున్నారు.
వైద్య వృత్తిని అభ్యసిస్తూ
నగరానికి చెందిన సాయి స్వరూప్ మిమ్స్లో వైద్య వృత్తిని అభ్యసిస్తున్నారు. 2021లో జిల్లాస్థాయిలో జరిగిన యూత్ పార్లమెంట్ పోటీల్లో అవకాశం రాకపోయినా నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. గతేడాది వినియోగదారుల హక్కుల దినోత్సవం వేళ జిల్లాస్థాయి పోటీల్లో ద్వితీయం, ఆంధ్రా మెడికల్ కళాశాల వార్షికోత్సవం నాడు నిర్వహించిన చర్చలో ద్వితీయ స్థానాన్ని పొందారు. 2022లో ఎన్వైకే తలపెట్టిన యూత్ ఫెస్టివల్లో కూడా ‘దేశభక్తి..యువత’ అనే అంశంపై ప్రసంగించి ప్రశంసలు అందుకున్నారు.
బీ-టెక్ చదువుతూ..
ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీ-టెక్ చదువుతున్న ఎన్.అనూష తొలి ప్రయత్నంలోనే ప్రతిభ చూపింది. తల్లి గృహిణి కాగా.. తండ్రి వ్యాపారవేత్త. వేదికపై మాట్లాడేందుకు తొలుత భయం.. బెరుకు.. సిగ్గు ఉండేదని, నెమ్మదిగా వాటి నుంచి బయటపడాలంటే ఇటువంటి వేదికలను వినియోగించుకోవాలని తెలిసిందని అనూష చెబుతోంది. గతేడాది రఘు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన యూత్ ఫెస్టివల్లో ‘దేశభక్తి.. యువత’ అనే అంశంపై మాట్లాడి అందరి మెప్పూ పొందింది.
మేఘన ప్రతిభ..
గరివిడిలోని పశు వైద్య కళాశాలలో వెటర్నరీ కోర్సు చదువుతున్న ఎస్.ముత్య మేఘన ఎన్సీఎస్ సమీపాన ఉంటున్నారు. తండ్రి రాకోడు పీహెచ్సీలో ఉద్యోగం చేస్తుండగా.. తల్లి ఇంటి బాధ్యతలు చూస్తున్నారు. గతేడాది ఉన్నత విద్యా మండలి నిర్వహించిన రాష్ట్రస్థాయి క్విజ్ పోటీల్లో ఆమె సెమీ ఫైనల్ వరకూ వెళ్లింది. జిల్లా స్థాయిలో చక్కని ప్రసంగంతో రాష్ట్రస్థాయికి ఎంపికైన తన కు మరోమారు ప్రతిభను నిరూపించుకునే అవకాశం కలిగిందని పేర్కొంటోంది.
ఇందూ నైపుణ్యం..
నగరంలోని ఎ.శ్రీదేవి, ఆనంద ప్రసాద్ దంపతుల కుమార్తె ఇందు జాహ్నవి ప్రస్తుతం బీ-టెక్ చదువుతోంది. గతంలో పలుసార్లు కళాశాల వేదిక మీద వివిధ అంశాలపై ప్రసంగించిన అనుభవంతో ఆమె దూసుకుపోతోంది. తండ్రి మెడికల్ రంగంలో ఉండగా.. తల్లి గృహిణి. పైడితల్లి ఉత్సవాల కార్యక్రమానికి యాంకర్గా కూడా పనిచేశానని, అది తనకు ఎంతో ఉపయోగపడిందంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..