మాటల ముత్యాలు
దేశంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి...?, రాజకీయ, నైపుణ్య, సాంకేతికత తదితర అంశాలపై యువత ఏమనుకుంటోంది...? ఏం కోరుకుంటోంది...? వారేం చేయాలనుకుంటున్నారు..? ఏం చేస్తే బాగుంటుంది..? ఇలా యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘యూత్ పార్లమెంట్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
యూత్ పార్లమెంట్కు నలుగురి ఎంపిక
ఆన్లైన్లో అభ్యర్థుల ఉపన్యాసం వింటున్న న్యాయ నిర్ణేతలు
విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్టుడే: దేశంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి...?, రాజకీయ, నైపుణ్య, సాంకేతికత తదితర అంశాలపై యువత ఏమనుకుంటోంది...? ఏం కోరుకుంటోంది...? వారేం చేయాలనుకుంటున్నారు..? ఏం చేస్తే బాగుంటుంది..? ఇలా యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘యూత్ పార్లమెంట్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల నెహ్రూ యువ కేంద్రం(ఎన్వైకే) ప్రాంతీయ స్థాయిలో పోటీలు నిర్వహించగా ఉమ్మడి జిల్లాల నుంచి రాష్ట్రస్థాయికి నలుగురు అర్హత సాధించారు. వారేం అన్నారో తెలుసుకుందామా..
ఎంపిక ఇలా..
జిల్లాల వారీగా ఎంపిక చేసిన వారిని రాష్ట్రస్థాయికి, అక్కడి నుంచి జాతీయ స్థాయికి పంపించి పార్లమెంట్ భవన్లో ప్రసంగించే అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది మార్పుల్లో భాగంగా సుమారు ఆరు నుంచి ఏడు జిల్లాల వారిని ప్రాంతీయ విభాగంగా ఏర్పాటు చేశారు. గత నెల 27న విజయనగరం శాఖకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇందులో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 70 మందికి వర్చువల్ విధానంలో పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాల నుంచి నలుగురు రాష్ట్రస్థాయికి అర్హత సాధించారు. ఆ పోటీల వేదిక, నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటించనున్నారు.
వైద్య వృత్తిని అభ్యసిస్తూ
నగరానికి చెందిన సాయి స్వరూప్ మిమ్స్లో వైద్య వృత్తిని అభ్యసిస్తున్నారు. 2021లో జిల్లాస్థాయిలో జరిగిన యూత్ పార్లమెంట్ పోటీల్లో అవకాశం రాకపోయినా నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. గతేడాది వినియోగదారుల హక్కుల దినోత్సవం వేళ జిల్లాస్థాయి పోటీల్లో ద్వితీయం, ఆంధ్రా మెడికల్ కళాశాల వార్షికోత్సవం నాడు నిర్వహించిన చర్చలో ద్వితీయ స్థానాన్ని పొందారు. 2022లో ఎన్వైకే తలపెట్టిన యూత్ ఫెస్టివల్లో కూడా ‘దేశభక్తి..యువత’ అనే అంశంపై ప్రసంగించి ప్రశంసలు అందుకున్నారు.
బీ-టెక్ చదువుతూ..
ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీ-టెక్ చదువుతున్న ఎన్.అనూష తొలి ప్రయత్నంలోనే ప్రతిభ చూపింది. తల్లి గృహిణి కాగా.. తండ్రి వ్యాపారవేత్త. వేదికపై మాట్లాడేందుకు తొలుత భయం.. బెరుకు.. సిగ్గు ఉండేదని, నెమ్మదిగా వాటి నుంచి బయటపడాలంటే ఇటువంటి వేదికలను వినియోగించుకోవాలని తెలిసిందని అనూష చెబుతోంది. గతేడాది రఘు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన యూత్ ఫెస్టివల్లో ‘దేశభక్తి.. యువత’ అనే అంశంపై మాట్లాడి అందరి మెప్పూ పొందింది.
మేఘన ప్రతిభ..
గరివిడిలోని పశు వైద్య కళాశాలలో వెటర్నరీ కోర్సు చదువుతున్న ఎస్.ముత్య మేఘన ఎన్సీఎస్ సమీపాన ఉంటున్నారు. తండ్రి రాకోడు పీహెచ్సీలో ఉద్యోగం చేస్తుండగా.. తల్లి ఇంటి బాధ్యతలు చూస్తున్నారు. గతేడాది ఉన్నత విద్యా మండలి నిర్వహించిన రాష్ట్రస్థాయి క్విజ్ పోటీల్లో ఆమె సెమీ ఫైనల్ వరకూ వెళ్లింది. జిల్లా స్థాయిలో చక్కని ప్రసంగంతో రాష్ట్రస్థాయికి ఎంపికైన తన కు మరోమారు ప్రతిభను నిరూపించుకునే అవకాశం కలిగిందని పేర్కొంటోంది.
ఇందూ నైపుణ్యం..
నగరంలోని ఎ.శ్రీదేవి, ఆనంద ప్రసాద్ దంపతుల కుమార్తె ఇందు జాహ్నవి ప్రస్తుతం బీ-టెక్ చదువుతోంది. గతంలో పలుసార్లు కళాశాల వేదిక మీద వివిధ అంశాలపై ప్రసంగించిన అనుభవంతో ఆమె దూసుకుపోతోంది. తండ్రి మెడికల్ రంగంలో ఉండగా.. తల్లి గృహిణి. పైడితల్లి ఉత్సవాల కార్యక్రమానికి యాంకర్గా కూడా పనిచేశానని, అది తనకు ఎంతో ఉపయోగపడిందంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదు పదుల వయసులోనూ పది పరీక్షకు హాజరు
[ 19-03-2024]
చదువుకోవాలనే తపన ఉండాలే కాని వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు గుమ్మలక్ష్మీపురం మండలంలోని మూలపాడుకు చెందిన పెద్దమ్మి. -
జీవనాధారం కల్పించండి సారూ!
[ 19-03-2024]
మన్యం జిల్లాలో ఏనుగులు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఐదేళ్లుగా జిల్లా నుంచి కదలకపోవడంతో రైతులతో పాటు పలు వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
కళ్లికోటలో కరిరాజుల అలజడి
[ 19-03-2024]
కొమరాడ మండలంలోని కళ్లికోట సమీపంలో కరిరాజుల గుంపు సంచరిస్తోంది. -
బిందెడు నీటికి ఎన్ని బాధలో..
[ 19-03-2024]
పార్వతీపురం మండలంలోని చినబొండపల్లిలో పరిస్థితి ఇది. గ్రామంలో ఇంటికో కుళాయి వేశారు. డి.శిర్లాం పైలెట్ ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా చేసేవారు. -
96.99 శాతం హాజరు
[ 19-03-2024]
జిల్లాలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 66 కేంద్రాల్లో 10,746 మందికి గాను 10,423 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఈ కష్టాలు ఎప్పుడు తీరేనో..?
[ 19-03-2024]
-
దోపిడీలకు దారొదిలేశారు!!
[ 19-03-2024]
గరుగుబిల్లి మండలంలోని ఖడ్గవలస కూడలి వద్ద ఓ రైస్ మిల్లు యజమాని తన భార్యతో కలిసి నివాసముంటున్నారు. గత నెల 26న ఉదయం సదరు వ్యక్తి మోటారు వేసేందుకు బయటకు వచ్చారు. -
ఐదేళ్లు ఊరుకున్నారు.. చివరిలో జారుకున్నారు!
[ 19-03-2024]
బొబ్బిలి పట్టణంలోని రామన్నదొరవలస వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్ల సముదాయాల్లో కొన్నింటిని ఎట్టకేలకు పూర్తి చేశారు. మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించలేదు. -
ఎమ్మెల్యే సారూ..90 రోజుల్లో ఇల్లెక్కడ
[ 19-03-2024]
నిజంగా ప్రభుత్వం ఇస్తుందేమోనని కొందరు స్థలం కోసం, ఇంకొందరు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకుంటామని ముందుకొచ్చారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. -
అమృత్ అందలే
[ 19-03-2024]
పురపాలక సంఘాల్లో మరో 20 ఏళ్ల వరకు దాహార్తి సమస్య లేకుండా చేయాలన్నది అమృత్ 2.0 ఉద్దేశం. పార్కులు, మురుగునీటి శుద్ధి ప్లాంటు వంటి పనులు ప్రతిపాదించారు. తీరా ఈ ప్రభుత్వంలో పనులు చేస్తే బిల్లులు వస్తాయా? -
వదలా.. బొమ్మాళీ
[ 19-03-2024]
అధికారంలో ఉన్నాం.. మమ్మల్నెవరు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో అధినేత జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల ఫ్ల్లెక్సీలను విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ప్రధాన కూడళ్లు, రహదారుల పక్కన విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. -
పట్టా పుట్టించారు.. సాయం పెంచేశారు
[ 19-03-2024]
ఓట్ల వేటలో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు లేని పట్టాలను పుట్టిస్తోంది వైకాపా ప్రభుత్వం. వివిధ పథకాల కింద అందిన సొమ్ము సైతం ఎక్కువ అందినట్లు చెబుతూ ప్రచారం చేసుకుంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు