అందరి సహకారంతో జిల్లాకు గుర్తింపు
కొత్తగా ఏర్పడిన జిల్లా అనతికాలంలోనే జాతీయ స్థాయి గుర్తింపు సాధించి వివిధ కేటగిరీల్లో నాలుగు జాతీయ పురస్కారాలు పొందడం ఆనందంగా ఉందని కలెక్టర్ నిశాంత్కుమార్ పేర్కొన్నారు.
పాలకొండ, పాలకొండ గ్రామీణం, న్యూస్టుడే: కొత్తగా ఏర్పడిన జిల్లా అనతికాలంలోనే జాతీయ స్థాయి గుర్తింపు సాధించి వివిధ కేటగిరీల్లో నాలుగు జాతీయ పురస్కారాలు పొందడం ఆనందంగా ఉందని కలెక్టర్ నిశాంత్కుమార్ పేర్కొన్నారు. పాలకొండలో రైతు భరోసా అయిదో విడత, పెట్టుబడి రాయితీ కింద 1,42,930 మంది రైతులకు రూ.107.19 కోట్ల నమూనా చెక్కును గురువారం అందజేశారు. ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ సీతంపేట, పార్వతీపురం, కురుపాం, సాలూరులో ఇంజినీరింగ్ కళాశాలలు, ఐటీఐలు ఉన్నాయని, డివిజన్ కేంద్రం పాలకొండలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల లేకపోవడంతో యువత ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ఇక్కడ ఏర్పాటు చేసేలా చూడాలని కలెక్టర్ను కోరారు. ఈ ప్రాంత రైతులకు ప్రయోజనం కలిగేలా తోటపల్లి జలాశయం ఆధునికీకరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్సీ విక్రాంత్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంత్కుమార్, సబ్ కలెక్టర్ నూరుల్కమర్ను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సత్కరించారు. నాగవంశం కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఎన్.శివప్రసాద్, ఉప ఎంపీపీలు కె.సూర్యప్రకాశ్, వి.అనిల్కుమార్, జేడీ రాబర్ట్పాల్ పాల్గొన్నారు.
ఎండ వేడితో అవస్థలు
సమావేశానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు టెంట్లు వేసినా వేడి గాలులకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రారంభంలో నీరు, మజ్జిగ అందించారు. అనంతరం నీరు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కొందరు రైతులు సమావేశం మధ్యలోనే వెనుదిరిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్