రక్తదాతలూ.. మీరే ప్రాణాలు నిలపాలి
ఊహించని ప్రమాదాలు.. అత్యవసర పరిస్థితుల్లో.. వేలాది మంది ప్రాణాలు నిలబెడుతున్న రక్తనిధి కేంద్రాల్లో వేసవి కారణంగా నిల్వలు అడుగంటుతున్నాయి.
జిల్లాలో గణనీయంగా తగ్గిన నిల్వలు
న్యూస్టుడే, పార్వతీపురం పట్టణం, పాలకొండ, సాలూరు
కొమరాడ మండలం పెద్దశాఖకి చెందిన గర్భిణి సరస్వతిని ఇటీవల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఏబీ-పాజిటివ్ రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించారు. దాత కోసం ఇబ్బందులు పడగా సదరు కుటుంబీకులు చివరికి రెడ్క్రాస్ సొసైటీ సభ్యుల సాయంతో దాతను కనుగొన్నారు. వేసవి, ఎండతాపంతో దాతలు ముందుకు రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పార్వతీపురం మండలానికి చెందిన గర్భిణి రేవతి రెండ్రోజుల కిందట జిల్లా ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరారు. ఒ-పాజిటివ్ రక్తం అవసరమని, దాతను తీసుకొని రావాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. తెలిసిన వారెవరూ ముందుకు రాకపోవడంతో విషయం తెలుసుకున్న రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు దాత వారణాసి వెంకటరమణను సంప్రదించగా ఇచ్చారు. ఇతను 99వ సారి రక్తదానం చేశారు.
ఊహించని ప్రమాదాలు.. అత్యవసర పరిస్థితుల్లో.. వేలాది మంది ప్రాణాలు నిలబెడుతున్న రక్తనిధి కేంద్రాల్లో వేసవి కారణంగా నిల్వలు అడుగంటుతున్నాయి. అరుదైన రక్తం కావాలంటే దాతల కోసం వెతుకులాట తప్పడం లేదు. విపరీతమైన ఎండలతో దాతలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు దానానికి ముందుకు రావడం లేదు. 300 యూనిట్లు నిల్వ చేసే శీతల పరికరంలో 55 యూనిట్లు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉందంటే కొరత తీవ్రత అర్థం చేసుకోవచ్చు. పాలకొండ, సాలూరు, సీతంపేట ప్రాంతీయాసుపత్రుల్లో సరఫరా కేంద్రాలున్నాయి. ఆయా చోట్ల 60 యూనిట్ల చొప్పున నిల్వచేసే అవకాశం ఉన్నా.. రెండు, మూడు యూనిట్లు మాత్రమే ఉన్నాయి.
పార్వతీపురం మన్యంలో ఒక జిల్లా ఆసుపత్రి, మూడు ప్రాంతీయాసుపత్రులు, మూడు సీహెచ్సీలు, 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో ఏటా 240 వరకు వివిధ రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. సుమారు 1,200 మంది గాయపడుతున్నారు. వీరిలో సుమారు 700 మందికి రక్తం అవసరం అవుతోంది. ఏటా జరిగే 12,000 ప్రసవాల్లో ఆరేడు వేల మందికి రక్తం కావాలి. అలాగే తలసేమియా, సికిల్సెల్ ఎనీమియా, రక్తహీనతతో బాధపడే వారికీ ఉండాలి. వీళ్లందరికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రక్తనిధి, సరఫరా కేంద్రాల నుంచి అందిస్తున్నారు. ఏటా 8,000 యూనిట్ల రక్తం అవసరం కాగా.. సేకరణ 3,000 మాత్రమే ఉంది. జిల్లాలో రోజుకు 8 నుంచి 10 యూనిట్ల రక్తం అవసరం అవుతోంది. సాలూరు, సీతంపేట, పాలకొండ ప్రాంతీయాసుపత్రుల్లో నాలుగైదు యూనిట్లు, కురుపాం, చినమేరంగిలో రెండు యూనిట్ల చొప్పున అవసరం. ఈ లెక్కన నెలకు 600 యూనిట్లకి పైగా ఉండాలి.
ఇందులోనూ చూసుకోవచ్చు: రక్తనిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయి...? ఏ బ్లడ్ బ్యాంకులో ఉన్నాయి..? ఎలా సద్వినియోగం చేసుకోవాలి..? తదితర వివరాలు తెలుసుకునేందుకు ’ e-rakthakosh అనే వెబ్సైట్, యాప్ పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న బ్లడ్ బ్యాంకుల వివరాలు ఇందులో నమోదై ఉంటాయని వైద్యఆరోగ్య శాఖ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.
కొవిడ్ ప్రభావం
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పోస్టు కొవిడ్ ప్రభావంతో చాలా మంది ఇప్పటికీ పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల రక్తదానానికి ముందుకు రావడం లేదు. శరీరంలో శక్తి తగ్గడం వల్ల.. రక్తమిస్తే నీరసంగా అవుతామనే అపోహ ఉంది. ఆయాసం, బరువు తగ్గడం, తరచూ జ్వరాల బారినపడటం వంటి రుగ్మతలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఇవ్వలేకున్నామని దాతలు చెబుతున్నారు. కొవిడ్కి ముందు జిల్లాలో ఏడాదికి 70- 100 రక్తదాన శిబిరాలు జరిగేవి. తర్వాత ఆ సంఖ్య 40-50కు చేరింది. దీనికి తోడు వేసవిలో కళాశాలలు, విద్యాసంస్థలు మూతపడటంతో శిబిరాలకు ఆస్కారం లేకుండా పోయింది.
రక్తం అవసరమైతే రండి
విజయనగరం వైద్య విభాగం, న్యూస్టుడే: ఎవరికైనా రక్తం కావాల్సి వస్తే విజయనగరం ఇండియన్ రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకులో అందుబాటులో ఉందని ఆ సంస్థ ఛైర్మన్ కేఆర్డీ ప్రసాదరావు, కార్యదర్శి కె.సత్యం శుక్రవారం తెలిపారు. ఏ-పాజిటివ్ 30, బి-పాజిటివ్ 32, ఓ-పాజిటివ్ 54, ఏబీ పాజిటివ్-01, బి-నెగిటివ్ 1 ప్యాకెట్లు ఉన్నాయని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అవగాహన పెంచుతున్నాం
- వాగ్దేవి, డీసీహెచ్ఎస్, పార్వతీపురం
వేసవిలో రక్తదానం చేయకూడదన్నది కేవలం అపోహ. రక్తదాతలు ముందుకొస్తే వారికి ఇబ్బందులు రాకుండా సురక్షితంగా రక్తం సేకరిస్తాం. స్వచ్ఛంద సంస్థలు, హీరోల అభిమాన సంఘాలను సంప్రదిస్తున్నాం. వేసవి కావడంతో యువత సాకార శిబిరాలకు అవకాశం తగ్గింది. ఆపదలో ఉన్నవారిని దృష్టిలో పెట్టుకొని దాతలు స్పందించాలి. అరుదైన గ్రూపు రక్తం ఉన్నవారి చరవాణి నంబర్లు సేకరించాం. అత్యవసర సమయాల్లో వారిని సంప్రదిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..