ఆపద్బాంధవులకూ కష్టాలే!!
అగ్ని ప్రమాదం సంభవిస్తే ఠక్కున గుర్తొచ్చేది అగ్నిమాపక దళమే. భారీ యంత్రాలు, బరువైన పరికరాలతో ఎంత పెద్ద భవనాలనైనా ఎక్కి మంటలను అదుపు చేసేందుకు మృత్యువుతో పోరాడుతారు. మరి ఆ విభాగానికే కష్టమొస్తే.. అలాంటి పరిస్థితే జిల్లాలో నెలకొంది.
విజయనగరం నేరవార్తావిభాగం, న్యూస్టుడే
జిల్లా అధికారి విధులు నిర్వహిస్తున్న పాత కేంద్రం
అగ్ని ప్రమాదం సంభవిస్తే ఠక్కున గుర్తొచ్చేది అగ్నిమాపక దళమే. భారీ యంత్రాలు, బరువైన పరికరాలతో ఎంత పెద్ద భవనాలనైనా ఎక్కి మంటలను అదుపు చేసేందుకు మృత్యువుతో పోరాడుతారు. మరి ఆ విభాగానికే కష్టమొస్తే.. అలాంటి పరిస్థితే జిల్లాలో నెలకొంది. కనీస వసతులు లేక అవస్థలు పడుతున్నారు. అరకొర సౌకర్యాల నడుమే విధులు నిర్వహిస్తూ ఎలాగోలా నెట్టుకొస్తున్నారు.
బిల్లుల విడుదలలో జాప్యం..
జిల్లా కేంద్రంలో ఉన్న విభాగాన్ని డబుల్ ఇంజిన్ స్టేషన్ అంటారు. ఇక్కడ ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తారు. జిల్లా అధికారితో పాటు, సహాయ అధికారి కూడా ఉంటారు. 24 గంటలూ అందుబాటులో ఉండాల్సి రావడంతో విశ్రాంతి గదులు అవసరం. అవన్నీ ఏళ్ల నాటివి కావడంతో వారి కష్టాలను గుర్తించిన గత ప్రభుత్వం రూ.1.20 కోట్లతో కొత్తస్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనులు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. గుత్తేదారుడు బిల్లులు రాలేదని పలుమార్లు న్యాయస్థానానికి వెళ్లి పోరాడాల్సి వచ్చింది. నేటికీ ఆ భవనం అందుబాటులోకి రాలేదు. దీంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.
తప్పని కొరత..: పదేళ్ల కిందట సమకూర్చిన సామగ్రి, వాహనాలనే ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో రెండు ఫైరింజన్లతో పాటు మిస్ట్ జీపు, మిస్ట్ బుల్లెట్, మినీ వ్యాన్లున్నాయి. మిగిలిన ఏడు స్టేషన్లలో ఒక్కో వాహనమే ఉంది. అగ్నిమాపక సహాయ అధికారులు, లీడింగ్ ఫైర్మెన్లు, పైలెట్ల కొరత వేధిస్తోంది. ఒక్కో స్టేషన్లో ముగ్గురు పైలెట్లకు ప్రస్తుతం ఇద్దరు చొప్పన ఉన్నారు. జిల్లా కేంద్రంలో మరొకరు అవసరం. ప్రమాదాల నియంత్రలో కీలకమైన స్కై లిఫ్ట్ నేటికీ సమకూరలేదు.
సగం పాతవే..
జిల్లాలో విజయనగరంతో పాటు చీపురుపల్లి, ఎస్.కోట, కొత్తవలస, గజపతినగరం, రాజాం, బొబ్బిలి, బాడంగిలో కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో మూడు తప్ప మిగిలిన వన్నీ పాత భవనాలే. ఇప్పటికే శిథిలావస్థకు చేరడంతో అధికారులే సొంత నిధులు వెచ్చిస్తూ మరమ్మతులు చేసుకుంటున్నారు. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు కేంద్రమే ఏర్పాటు కాలేదు. కోనాడ వద్ద స్థలం కేటాయించారని చెబుతున్నా కలగానే మిగిలిపోతోంది.
చెరువుల మీదే ఆధారం..
మంటలు ఆర్పేందుకు నీళ్లు అవసరం. ఏటా వేసవిలో ఇబ్బందులు తప్పడం లేదు. చెరువులే దిక్కవుతున్నాయి. నిధులు లేకపోవడంతో స్టేషన్ల ప్రాంగణంలో బావులు, మోటార్ల ఏర్పాటు అటకెక్కింది. దీంతో నీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కొన్నిసార్లు ఆలస్యం కావడంతో ప్రమాద తీవ్రత పెరుగుతోంది. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని అగ్నిమాపకశాఖ జిల్లా అధికారి రామ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..