లుంబూరు కాలనీలో సౌకర్యాలేవన్నా!
ప్రభుత్వం ఆర్భాటంగా ఇళ్లు కాదు... ఊళ్లే నిర్మించేస్తామంటూ అట్టహాసంగా జగనన్న కాలనీలను మంజూరు చేసి నాలుగేళ్లవుతున్నా నేటికీ కనీస సదుపాయాలు కల్పించలేదు. స్థలాలిచ్చాం... మీరే కట్టుకోండంటూ లబ్ధిదారులను గాలికొదిలేసింది.
రాళ్లు తేలిన రహదారి
పాలకొండ, గ్రామీణం, న్యూస్టుడే: ప్రభుత్వం ఆర్భాటంగా ఇళ్లు కాదు... ఊళ్లే నిర్మించేస్తామంటూ అట్టహాసంగా జగనన్న కాలనీలను మంజూరు చేసి నాలుగేళ్లవుతున్నా నేటికీ కనీస సదుపాయాలు కల్పించలేదు. స్థలాలిచ్చాం... మీరే కట్టుకోండంటూ లబ్ధిదారులను గాలికొదిలేసింది. కాలనీలో వందలాది ఇంటి స్థలాలు ఇచ్చినా నేటికీ నిర్మాణాలు మాత్రం పూర్తికాలేదు.
పాలకొండలోని లుంబూరు పంచాయతీ పరిధిలో గరుగుబిల్లి గ్రామ సమీపంలో పంట పొలాలను కొనుగోలు చేసి లేఅవుటు ఏర్పాటు చేశారు. ఇక్కడ 1,300 మంది వరకు లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందించారు. ఒక్కొక్కరికీ సెంటు చొప్పున స్థలాలు ఇచ్చారు. ఈ కాలనీకి చేరుకోవాలంటే పాలకొండ నుంచి రెండు కి.మీ. వెళ్లాల్సిందే. గాసివీధి నుంచి లేఅవుట్ వరకు రహదారులు రాళ్లు తేలి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది.
కానరాని తాగునీరు
వందలాది మంది లబ్ధిదారులకు ఇచ్చిన లేఅవుట్లో తాగునీటి సమస్య ప్రధానంగా ఉంది. పట్టణానికి దూరంగా ఉండడంతో తాగునీరు తెచ్చుకునేందుకు వీలులేకుండా ఉంది. ఈ కారణంగా చాలా మంది లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తిచేసుకున్న వారంతా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. జలజీవన్ మిషన్లో భాగంగా రూ.3 కోట్లు నిధులు మంజూరైనా నేటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
నిర్మాణానికి నీరేదీ
లేఅవుట్ ఉన్న ప్రాంతంలో నీటి సదుపాయం లేక నిర్మాణాలను లబ్ధిదారులు ప్రారంభించడం లేదు. దీంతో అధికారులు లుంబూరు గెడ్డ నుంచి పైపుల ద్వారా నీరందించేందుకు 30 వరకు సంపులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.80 లక్షలు ఖర్చు చేశారు. ప్రస్తుతం వేసవి కావడంతో గెడ్డలో నీరు లేక నిర్మాణాలకు అందడం లేదు. నిర్మించిన సంపులు సైతం పలు చోట్ల శిథిలమయ్యాయి.
ఇంటింటి కుళాయిలు వేసేందుకు తెచ్చిన పైపులుస
అంతర్గత రహదారులూ అంతే
కాలనీలో ప్రధాన రహదారితో పాటు 22 వరకు అంతర్గత రహదారులు ఉన్నాయి. అన్నింటా గ్రావెల్ రోడ్లు నిర్మించారు. ఇందుకోసం రూ.60 లక్షల వరకు వ్యయం చేశారు. చిన్నపాటి వర్షం కురిసినా ఈ రహదారులు బురదమయంగా మారి ద్విచక్రవాహనాలు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
వీధి కాలువలేవీ
అత్యంత విశాలమైన ప్రాంతంలో లేఅవుట్ ఉంది. తాత్కాలికంగా గ్రావెల్ రహదారులు నిర్మించినా కాలువల నిర్మాణం చేపట్టలేదు. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా వీధుల్లో నీరు పోయేందుకు మార్గం లేకుండా పోయింది. ఖాళీ స్థలాల్లో నీరు నిలిచిపోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోతలరాయ.. ఎత్తిపోతల నీరేదయ్యా
[ 27-04-2024]
ముఖ్యమంత్రి జగన్కు రైతుల సమస్యలు ఏమాత్రం పట్టడం లేదు. బహిరంగ సభల్లో బాకా ఊదడం మినహా అన్నదాతల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపడం లేదు. -
నామపత్రాల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అరకు పార్లమెంటరీ, నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం వరకు దాఖలైన నామపత్రాలను రిటర్నింగ్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా అన్నారు. -
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలి
[ 27-04-2024]
వైకాపా అరాచక పాలనకు ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిని కొత్తపల్లి గీత, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు. -
వైనాట్ 175 కాదు.. వైకాపాకు 17
[ 27-04-2024]
జనసేన స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్పాలకొండ, గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్రంలో కూటమి గెలుపు తథ్యమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయమని జనసేన స్టార్ క్యాంపెయినర్, సినీనటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. -
వైకాపాతో యువతకు నష్టం: కిమిడి
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, యువతకు ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లిపోయారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు -
ఇంజినీరింగ్ విద్య.. ఓ జగన్మాయ
[ 27-04-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూనే వారిపై కపట ప్రేమ చూపించి ఆయా వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేశారు సీఎం జగన్మోహన్రెడ్డి. తన సొంత కుటుంబంగా భావించి గిరిజనులకు మంచి చేస్తానని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ప్రేమ ఒలకబోసి దెబ్బ కొట్టారు. -
ప్రజల వద్దకే సేవలంటే ఇలాగేనేమో..
[ 27-04-2024]
గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. -
వీటిని చూస్తే.. పేకమేడలే సిగ్గు పడవా!!
[ 27-04-2024]
పేదలకు అన్ని వసతులతో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి.. రేపోమాపో కూలిపోయే పేకమేడలు నిర్మిస్తున్నారు. -
అభివృద్ధిపైనా అక్కసేనా?
[ 27-04-2024]
ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.. ఇందుకు విరుద్ధంగా ఉంది వైకాపా ప్రభుత్వం తీరు.. ప్రజల అవసరాలతో పని లేదన్నట్లు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు నిలిపేసి అక్కసు ప్రదర్శించింది.
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి