logo

తెదేపాలో వైకాపా కార్యకర్తల చేరిక

చీపురుపల్లి మేజర్‌ పంచాయతీలో వైకాపాకు చెందిన 13వ వార్డు సభ్యురాలు మీసాల కామేశ్వరి, శ్రీనివాసరావు దంపతులు, మాజీ వార్డు సభ్యుడు రెడ్డి త్రినాథ, ఆ పార్టీ సీనియర్‌ కార్యకర్తలు రెడ్డి అసిరినాయుడు,

Published : 18 Apr 2024 04:53 IST

కుండువా వేస్తున్న కిమిడి కళా వెంకటరావు

చీపురుపల్లి, గ్రామీణం, న్యూస్‌టుడే: చీపురుపల్లి మేజర్‌ పంచాయతీలో వైకాపాకు చెందిన 13వ వార్డు సభ్యురాలు మీసాల కామేశ్వరి, శ్రీనివాసరావు దంపతులు, మాజీ వార్డు సభ్యుడు రెడ్డి త్రినాథ, ఆ పార్టీ సీనియర్‌ కార్యకర్తలు రెడ్డి అసిరినాయుడు, రెడ్డి లక్ష్మణ, రెడ్డి మన్మథరావు, బెవర భానుచందర్‌, వి.వెంకటరమణ, రెల్లి అప్పారావు, గిరిడ కామరాజు తదితరులు కూటమి అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు సమక్షంలో బుధవారం తెదేపాలో చేరారు. ఆంజనేయపురంలోని మీసాల శ్రీనివాసరావు నివాసం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి కళా వెంకటరావు కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, నాయకులు రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, శ్రీనివాసరావు, కోట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని