వాహనాల్లో కుక్కేశారు.. ట్రాఫిక్లో ఉంచేశారు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నామినేషన్ల పర్వం సాగింది. ఈక్రమంలో వైకాపా అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలతో పాటు కూలీలను తరలించారు.
వైకాపా అభ్యర్థుల నామినేషన్లలో అడుగడుగునా అవస్థలు
పాలకొండ, గ్రామీణం, సీతంపేట, పార్వతీపురం, కురుపాం గ్రామీణం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నామినేషన్ల పర్వం సాగింది. ఈక్రమంలో వైకాపా అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలతో పాటు కూలీలను తరలించారు. వాహనాల్లో పెద్దఎత్తున ఎక్కించి, నియోజకవర్గ కేంద్రాలకు తీసుకెళ్లారు. ఈక్రమంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్నిచోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. కురుపాం, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు వైకాపా అభ్యర్థులు పుష్పశ్రీవాణి, కళావతి నామినేషన్లు వేశారు. ఈ సమయంలో ఇష్టానుసారంగా వాహనాలు తీసుకురావడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వాహనాల్లో కార్యకర్తలను తీసుకురావడంతో సీతంపేటలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సుమారు రెండు గంటల పాటు మండుటెండలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాలకొండ వైపు వెళ్తున్న 108 అంబులెన్స్ వాహనాల మధ్య చిక్కుకుంది. బందోబస్తులో ఉన్న పోలీసులు చేరుకొని సరిచేశారు. కళావతి నామినేషన్ పూర్తికాకముందే పార్టీ కార్యకర్తలు జెండాలతో మద్యం దుకాణాలకు చేరుకొని హడావుడి చేశారు.
కురుపాంలో ఇలా..
కురుపాంలో నాలుగు నియోజకవర్గ కార్యకర్తలు హంగామా చేశారు. మద్యం దుకాణాలు వద్ద పార్టీ జెండాలు, టోపీలు ధరించి బారులు తీరారు. ఇక్కడ మార్కెట్ రోడ్డు విస్తరణ పనులు ఆగిపోవడంతో వాహనం వెళ్లాలంటేనే ఇబ్బందులు పడాలి. అలాంటిది ర్యాలీగా రావడంతో గుమ్మలక్ష్మీపురం నుంచి పార్వతీపురం వెళ్లే వాహనాల అరగంట పాటు నిలిచిపోయాయి. జడ్పీ ఉపాధ్యక్షుడు బాపూజీనాయుడు ఆర్వో కార్యాలయం లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆంక్షలు విధించారు. అభ్యర్థి నామినేషన్ వేసే సమయంలో నాయకులు కనిపించకపోవడంతో వారితో వచ్చిన ప్రజలు ఎండ వేడి తట్టుకోలేక చెట్ల కిందకు చేరుకున్నారు.
ఉద్యోగినులకు ఇబ్బందులు..
పార్వతీపురం కలెక్టరేట్లో నామపత్రాలు స్వీకరించారు. ఇక్కడ 100 మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులు విధులకు హాజరు కావాలని చెప్పినా, ప్రధాన ద్వారంలో వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దీంతోపాటు కార్యాలయాలకు పనిమీద వచ్చే వారినీ లోపలకు వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో వారు నిరాశగా వెనుతిరిగారు. ఆర్ఐని కలిసేందుకు వచ్చిన వృద్ధ దంపతులు ఎండలో తిరిగి వెళ్లిపోయారు.
బొబ్బిలి, న్యూస్టుడే: వైకాపా అభ్యర్థి శంబంగి వెంకట చినప్పలనాయుడు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి జనాలను ప్రత్యేక వాహనాల్లో తీసుకువచ్చారు. పట్టణ నలువైపులా ఆటోలు బారులు తీరడం, కొంతమంది రహదారుల చెంతే ఆపేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడి, సాధారణ ప్రజలు ఎండలో అవస్థలు పడ్డారు. చీపురుపల్లి వీధిలోని పార్టీ కార్యాలయానికి కొందరు ఆటోల్లో చేరుకోవడంతో గాంధీబొమ్మ రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎస్బీఐ, ఇతర బ్యాంకులకు వెళ్లే వారంతా ఇబ్బందులు పడ్డారు. అక్కడి నుంచి శంబంగి వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామిని దర్శించుకుని, వెళ్లారు. ఆపై ఓపెన్టాప్ వాహనంలో ర్యాలీగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ఫ్లై ఓవర్ వద్దకు చేరుకుని, మాట్లాడారు. వాహనాలు రోడ్డుకు ఇరువైపులా నిలిపివేయడంతో అరగంట సేపు వాహనాలు బారులుతీరి, కదల్లేదు. పోలీసులు కట్టడి చేసేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఆర్టీసీ కాంప్లెక్సు కూడలిలో కూడా కొంత సమయం ట్రాఫిక్ నిలిచిపోవడంతో అత్యవసర పనులకు వెళ్లే జనం అవస్థలు పడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా రంగుల పిచ్చితో రూ.2300 కోట్లు దుబారా: పవన్ కల్యాణ్
[ 02-05-2024]
రంగుల పిచ్చిలో వైకాపా ప్రభుత్వం రూ.2,300 కోట్లు దుబారా చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. -
ఆరేళ్ల నుంచి అసంపూర్తిగానే పంచాయతీ భవనం
[ 02-05-2024]
తెదేపా ప్రభుత్వ పాలనలో ప్రారంభమైన బలిజిపేట మండలంలోని వెంగాపురం గ్రామపంచాయతీ భవనం ఆరేళ్ల కిందట నుంచి నేటికీ పునాదులతోనే మిగిలిపోయింది. -
పింఛను దారుల అవస్థలు
[ 02-05-2024]
బలిజిపేట యూనియన్, స్టేట్బ్యాంకు, విశాఖ గ్రామీణ బ్యాంకుశాఖలు గురువారం సామాజిక పింఛనుదారులతో కిటకిటలాడాయి. -
రక్కసుడక్కడ.. ఇసుకాసురులిక్కడ!!
[ 02-05-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఇసుక తోడేళ్లు నదులపై పడ్డాయి.. ఈ ఐదేళ్లూ వాటిని గుల్ల చేసేశాయి.. నిత్యం టన్నుల మేర తవ్వేస్తూ తరలించుకుపోయాయి.. రూ.కోట్లలో లాభాలు ఆర్జించాయి.. -
నీ జమానాలో అక్కాచెల్లెమ్మలు బక్కచిక్కారు
[ 02-05-2024]
మైకు కనిపిస్తే చాలు... ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఎక్కడా లేని బంధుత్వాలు.. ఆప్యాయతలు.. తెగపుట్టుకొస్తాయి. ఏ వేదికపై మాట్లాడినా అక్కాచెల్లెమ్మలు.. నా ఎస్టీలు.. నా ఎస్సీలు.. గిరిజనులు, మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామంటూ మాటలతో ఊదరగొట్టేస్తారు. -
నేడు పాలకొండలో వారాహి యాత్ర
[ 02-05-2024]
పాలకొండ పట్టణంలో గురువారం జనసేన అధినేత పవన్కల్యాణ్ విజయ వారాహి యాత్ర జరగనుంది. ఈమేరకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వీరఘట్టం ప్రధాన రహదారిలో హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. -
వీరిని చూస్తుంటే బాధని‘పింఛన్’
[ 02-05-2024]
సామాజిక భద్రత పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారులకు కష్టాలు వచ్చి పడ్డాయి. -
మన్యంలో ‘దారి’ద్య్రమిది..
[ 02-05-2024]
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్, మంత్రులు చెబుతున్నా మన్యంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఐదేళ్లలో గిరిశిఖర గ్రామాల రోడ్లపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో దారులు అధ్వానంగా మారాయి. -
అంతా ఓకేనా.. ఓ సెల్ఫీ తీసుకుందాం
[ 02-05-2024]
సాలూరు మండలం కురుకుట్టి, సారిక పంచాయతీల్లో బుధవారం ప్రచారం చేసిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణితో పలువురు యువతులు స్వీయ చిత్రాలు తీసుకొని సందడి చేశారు. -
నీకు తప్ప.. రైతుకు ఏదీ భరోసా
[ 02-05-2024]
‘ఈ కేంద్రాల నుంచే వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలు అందుతాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు ప్రభుత్వమే గ్యారెంటీ ఉంటుంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాయి. -
ఒకటి పోయె.. రెండు వచ్చె
[ 02-05-2024]
సామాజిక భద్రత పింఛన్ల లబ్ధిదారులకు ఈ నెల నగదు బ్యాంకు ఖాతాల్లో వేసేందుకే ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటికీ పంపిణీ చేసే అవకాశం ఉందని, పరిశీలించాలని పండుటాకులు మొరపెట్టుకున్నా చెవికెక్కించుకోలేదు. -
జగన్ రాజ్యంలో.. ఇసుక దందా
[ 02-05-2024]
జగన్ రాజ్యంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నదుల్లో ఇసుకను అక్రమంగా తవ్వుకుపోతూ రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని పలు రేవుల నుంచి విశాఖ, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురానికి రోజూ వందల సంఖ్యలో లారీలతో తరలిస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. -
పాలకా... విస్తరణ మరిచారా!
[ 02-05-2024]
‘పాలకొండ ప్రధాన రహదారిని అభివృద్ధి చేస్తున్నాం.. పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ఇరువైపులా పెద్ద కాలువలను నగర పంచాయతీ నిధులతో నిర్మించనున్నాం..’ అంటూ మూడేళ్ల క్రితం పాలకులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. -
నేడు వెంకంపేటలో నితిన్ గడ్కరీ సభ
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అరకు పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థిని కొత్తపల్లి గీత తరఫున ప్రచారం చేసేందుకు కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ గురువారం పార్వతీపురం వస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం