logo

నామినేషన్‌కు తరలివెళ్లిన తెదేపా తమ్ముళ్లు

తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర గురువారం నామినేషన్‌కు వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని బలిజిపేట మండలంలోని అన్ని గ్రామాల నుంచి తెలుగు తమ్ముళ్లు పార్వతీపురం జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు.

Published : 25 Apr 2024 17:36 IST

బలిజిపేట: తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర గురువారం నామినేషన్‌కు వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని బలిజిపేట మండలంలోని అన్ని గ్రామాల నుంచి తెలుగు తమ్ముళ్లు పార్వతీపురం జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. తెదేపా మండల అధ్యక్షుడు పెంకి వేణుగోపాలనాయుడు, క్లస్టరు ఇన్‌ఛార్జిలు, గ్రామస్థాయి తెదేపా నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు వేర్వేరుగా ఆటోలు, ద్విచక్రవాహనాలు, లారీలు, వ్యాన్లపై పసుపు జెండాలు చేతపట్టి విజయచంద్ర జిందాబాద్‌ అంటూ నినాదాలు చేస్తూ అతనికి మద్దతుగా ర్యాలీ చేశారు. పార్వతీపురం పట్టణంగా పచ్చదనంతోనే నిండిపోయిందని పార్టీ అధ్యక్షులు వేణుగోపాలనాయుడు అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు