logo

రాష్ట్ర టెన్యూర్‌ పీపీల సంఘం అధ్యక్షుడిగా సత్యన్నారాయణ

రాష్ట్ర టెన్యూర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సి.హెచ్‌.వి.సత్యన్నారాయణ(గుంటూరు) ఎన్నికయ్యారు. శనివారం గుంటూరులో సమావేశమైన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

Published : 23 Jan 2022 03:31 IST

గుంటూరు లీగల్, న్యూస్‌టుడే : రాష్ట్ర టెన్యూర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సి.హెచ్‌.వి.సత్యన్నారాయణ(గుంటూరు) ఎన్నికయ్యారు. శనివారం గుంటూరులో సమావేశమైన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా అచంట వెంకటేశ్వరరావు (పశ్చిమగోదావరి), గౌరవాధ్యక్షులుగా కుర్రి బ్రహ్మారెడ్డి (ప్రకాశం), దాసరి ప్రతాప్‌కుమార్‌రెడ్డి (కడప), కార్యనిర్వాహక కార్యదర్శిగా కె.వి.రమణారెడ్డి(గుంటూరు), కోశాధికారిగా టి.శ్రీహారిరావు(కృష్ణ), మహిళా కార్యదర్శిగా షేక్‌ మస్తాన్‌బీ ఎన్నికయ్యారు. మరో 9 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికైన సత్యన్నారాయణ మాట్లాడుతూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు గడ్డం రాజేశ్వరరావు, బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని