ప్రైవేట్ పరీక్షల్లో బాదుడు
కొవిడ్ నిర్ధారణకు చేపట్టే ప్రైవేట్ పరీక్షలపై నియంత్రణ లోపించింది. దీంతో కొందరు ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. మొదటి, రెండు దశల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉండటం.. మరణాలు సంభవించాయి. దీంతో మూడో దశలో పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
మూడుచోట్లే ప్రభుత్వ ల్యాబ్లు
ముప్పు తెస్తున్న అనధికారిక కేసులు
ఒంగోలు నగరం, న్యూస్టుడే: కొవిడ్ నిర్ధారణకు చేపట్టే ప్రైవేట్ పరీక్షలపై నియంత్రణ లోపించింది. దీంతో కొందరు ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. మొదటి, రెండు దశల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉండటం.. మరణాలు సంభవించాయి. దీంతో మూడో దశలో పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో జిల్లా మొత్తానికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఒక్క జీజీహెచ్లోనే నిర్వహించేవారు. ఫలితంగా ఫలితాల్లో జాప్యం చోటుచేసుకునేది. కొన్ని రోజులు ర్యాపిడ్, ట్రూనాట్ పరీక్షలు కూడా చేపట్టారు. వాటిలో వ్యాధి నిర్ధారణ స్పష్టత లేకపోవడంతో ఆర్టీపీసీఆర్ పరీక్ష మాత్రమే చేయాలని ఆదేశాలిచ్చారు. మూడో దశలో ఎక్కువ కేసులు వస్తాయని భావించి అదనంగా మార్కాపురం, కందుకూరులోనూ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. అదే సమయంలో ప్రైవేట్గా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసేందుకు కొన్ని ల్యాబ్లకూ అనుమతి ఇచ్చారు.
ఇష్టానుసారం వసూలు...
ప్రైవేట్గా ఆర్టీపీసీఆర్ పరీక్షకు రూ.350కు మించి వసూలు చేయకూడదని ప్రభుత్వం ప్రకటించింది. అయితే క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు. దీనిపై నిఘా లేకుండా పోయింది. విదేశాలకు వెళ్లే వారికి 24 గంటల ముందు చేయించుకున్న పరీక్ష నెగెటివ్ అని నివేదిక ఉండాలి. అది కూడా క్యూఆర్ కోడ్తో ఉన్నది అవసరం. జీజీహెచ్లో ఆ సౌకర్యం లేదు. దీంతో విదేశాలకు వెళ్లేవారు ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ రూ.1000 నుంచి రూ. 1200 వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వచ్చిన వారి జాబితాను ఆ ప్రాంత ఏఎన్ఎంలకు పంపి వారం రోజులపాటు ఆరోగ్య పరిస్థితిని రోజూ వాకబు చేస్తారు. తనకు పాజిటివ్ వచ్చినట్టు ఇతరులకు తెలియకుండా గోప్యంగా ఉండాలని కోరుకునేవారు ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లి అడిగిన చెల్లించి పరీక్షలు చేయించుకుంటున్నారు.
లక్షణాలున్నా.. గోప్యంగా...: కొందరు తమకు కొవిడ్ లక్షణాలున్నా పరీక్షల జోలికి వెళ్లకుండా ఆర్ఎంపీలు, దుకాణాల్లో మందులు తీసుకొని వాడుకుంటున్నారు. ఈ తరహా ధోరణి వల్ల ప్రభుత్వం ప్రకటించే రోజువారీ పాజిటివ్ లెక్కలకు వాస్తవ పరిస్థితికి పొంతన ఉండటం లేదు. వ్యాధిసోకిన వారు వ్యక్తిగత దైనందిన అవసరాల కోసం బయట తిరుగుతున్నారు. ఫలితంగా వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తోంది.
ఎక్కువ వసూలు చేస్తే చర్యలు...
ఆర్టీపీసీఆర్ పరీక్షకు ప్రైవేట్గా రెండు కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు, కొన్ని ల్యాబ్లకు అనుమతి ఇచ్చాం. పరీక్షకు రూ.350 మాత్రమే వసూలు చేయాలి. అంతకు మించి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవు.
- డాక్టర్ పి.రత్నావళి, డీఎంహెచ్వో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న నేతల ఆగమనం.. ఒకేరోజు జగన్, లోకేష్, బాలకృష్ణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల తేదీ సమీపించే కొద్ది ప్రధాన పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై ప్రచారం జోరందుకోనుంది. -
రూ. 4.92 కోట్ల ఖర్చు.. రూ.2.21 కోట్ల జప్తు
[ 27-04-2024]
ఎన్నిల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2,21,90,514 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఓటర్లను ప్రభావితం చేసేలా పంచేందుకు సిద్ధం చేసినట్లుగా అనుమానిత వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హెచ్చరిక.. కండువాలు మారిస్తే జరిమానా
[ 27-04-2024]
ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. -
246మంది అభ్యర్థులు415నామినేషన్లు48తిరస్కరణలు
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. -
పేరుకే పోలీసులు..పుత్రరత్నం సేవలో బానిసలు
[ 27-04-2024]
పేరుకే పోలీసులు. నిత్యం వైకాపాకు వంతపాడుతుంటారు. ఆ నాయకులతో అంటకాగుతుంటారు.. అధికార పార్టీ నేతల సేవలో తరిస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. -
18,22,470 మంది చేతుల్లో భవిత
[ 27-04-2024]
మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల సవరణల ప్రక్రియ పూర్తయింది. -
తాడేపల్లి జలగ.. రక్త మాంసాలు పీల్చ
[ 27-04-2024]
అధికారంలోకి వస్తానే జగన్ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. -
పైసా విదిల్చింది లేదు
[ 27-04-2024]
గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది. -
తెదేపా పాలనలోనే అభివృద్ధి
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు.. ఆయన శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. -
కన్నీరే మిగిల్చావ్.. జగన్
[ 27-04-2024]
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. -
నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు
[ 27-04-2024]
రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. -
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.