logo

భైరవకోనలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు

జిల్లాలో ప్రసిద్ధి గాంచిన శైవ పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రం భైరవకోనను హైకోర్టు న్యాయమూర్తి వి.సుజాత శుక్రవారం సందర్శించి పూజలు నిర్వహించారు. జలపాతాన్ని వీక్షించారు. కాలభైరవేశ్వర స్వామి, త్రిముఖ దుర్గాంబ అమ్మవారు, శివలింగాలను

Published : 28 May 2022 06:29 IST

న్యాయవర్తి సుజాతకు స్వాగతం పలుకుతున్న అర్చకులు

సి.ఎస్‌.పురం, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన శైవ పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రం భైరవకోనను హైకోర్టు న్యాయమూర్తి వి.సుజాత శుక్రవారం సందర్శించి పూజలు నిర్వహించారు. జలపాతాన్ని వీక్షించారు. కాలభైరవేశ్వర స్వామి, త్రిముఖ దుర్గాంబ అమ్మవారు, శివలింగాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెను భైరవకోన పాలక మండలి అధ్యక్షుడు రమణారెడ్డి, ఆలయ కార్యనిర్వణాధికారి ఎన్‌.రూఫస్‌కుమార్‌, అర్చకులు స్వాగతం పలికి పూజల అనంతరం స్వామి వారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. పొలీసులు బందోబస్తు నిర్వహించారు. కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని