తీరనున్న వన్యప్రాణుల దాహార్తి
నల్లమలలో సంచరించే వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీశాఖ చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రూ.20 లక్షలతో చెరువులు, కుంటల్లో పూడికతీత, చెక్డ్యామ్లు, రాక్ఫిల్ డ్యామ్లను
అటవీశాఖ ప్రత్యేక చర్యలు
భూగర్భజలాల పెంపు లక్ష్యం
కుంటలో నిలిచిన నీటిని పరిశీలిస్తున్న అటవీ సిబ్బంది
నల్లమలలో సంచరించే వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీశాఖ చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రూ.20 లక్షలతో చెరువులు, కుంటల్లో పూడికతీత, చెక్డ్యామ్లు, రాక్ఫిల్ డ్యామ్లను నిర్మించారు. ఇటీవల కురిసిన వర్షాలతో వాటిలో నీరు చేరాయి. వాటితో పాటు డీప్ బోర్ల నుంచి సోలార్ సిస్టం ద్వారా కుంటల్లో నీరు నింపారు. దీంతో వన్యప్రాణులకు దాహార్తి తీరనుంది.
న్యూస్టుడే, పెద్దదోర్నాల
చెరువులో పూడికతీత
పులిచెరువు, పెద్దారుట్ల, పోతురాజుకుంట, సట్టుతండా చెరువు, చిన్నమంతనాల చెరువు తదితర వాటిలో రూ.3 లక్షలతో పూడిక తీయించారు. వాటిలో వర్షం నీరు చేరాయి.
సోలార్ సిస్టం ద్వారా...
వర్షం కురవని ప్రాంతాల్లో డీప్ బోర్లు వేసి వాటిని సోలార్ సిస్టంతో కాలువలు, చెరువులు నింపుతున్నారు. చిన్నమంతనాల బీటు పరిధిలో మూడు డీప్ బోర్లు వేసి సోలార్ బిగించారు. అందు కోసం రూ.5 లక్షలు ఖర్చు చేశారు. అవి నిత్యం పని చేస్తుంటాయి. దీంతో చెరువుల్లో, కుంటల్లో నీరు ఉంటోంది.
డీప్బోరుకు ఏర్పాటు చేసిన సోలార్ సిస్టం
పులిచెరువులో....
పులులు ఎక్కువగా సంచరించే పులిచెరువులో నీరు నింపేందుకు గతంలో అటవీశాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థ సంయుక్తంగా రూ.ఏడు లక్షలతో సోలార్ సిస్టంను ఏర్పాటు చేశారు. అయితే సోలార్కు సంబంధించిన మోటార్ మరమ్మతులకు గురైంది. అది డెన్మార్క్ సంబంధించినది కావడం దానిని మరమ్మతులు చేసే సాంకేతిక నిపుణులు అందుబాటులో లేరు. దీంతో పాటు డీప్ బోరు నుంచి అవసరమైన నీరు రావడంలేదు. దీంతో అటవీశాఖ నూతనంగా రూ.లక్షతో డీప్ బోరు వేసి సోలార్ సిస్టంను మరమ్మతులు చేయిస్తున్నారు. త్వరలో దానిని బిగించినట్లు అటవీ అధికారులు తెలిపారు.
నీటితో నిండి కనిపిస్తున్న రాక్ఫిల్ డ్యామ్
చెక్ డ్యామ్ల నిర్మాణం
చిన్నమంతనాల, చిలకచెర్ల బీట్ల పరిధిలో నాలుగు చెక్ డ్యామ్లు నిర్మించారు. వాటి కోసం రూ.10 లక్షలు ఖర్చు చేశారు. చిలకచెర్ల బీట్లో రూ.లక్షతో ఏడు రాక్ఫిల్ డ్యామ్లు ఏర్పాటు చేశారు. వీటిల్లో వర్షం నీరు నిల్వ ఉంది.
సద్వినియోగం చేసుకుంటాం
నల్లమల అటవీ ప్రాంతంలో భూగర్భ జలాలు పెంపొందించి ప్రత్యేక చర్యలు చేపట్టాం. చెక్ డ్యామ్లు, రాక్ఫిల్ డ్యామ్లు, చెరువులు, కుంటలు పూడికతీత, సోలార్ సిస్టం ద్వారా నీటి కుంటలు నింపడం తదితర పనులు చేస్తున్నాం. వర్షం నీరు వృథా పోకుండా నిల్వ ఉంచుతున్నాం. ఈ చర్యల వల్ల వన్యప్రాణుల దాహార్తి తీరటంతోపాటు అటవీ ప్రాంతం కోతకు గురికాకుండా, సారవంతమైన మట్టి కొట్టుకొని పోకుండా ఉంటుంది.
- విశ్వేశ్వరరావు, రేంజర్, దోర్నాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.