logo

పోస్టింగ్‌ కోసం పోలీసు మంతనాల

పోస్టింగ్‌ కోసం ఓ పోలీసు అధికారి నేతను ప్రసన్నం చేసుకునేందుకు ఏకంగా రెస్టారెంట్‌నే కేంద్రంగా చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. సోమవారం మంత్రుల రాక నేపథ్యంలో బందోబస్తు నిమిత్తం మార్కాపురం సబ్‌ డివిజన్‌ నుంచి పలువురు ఎస్సైలు పట్టణానికి చేరుకున్నారు. వారిలో ప్రస్తుతం కంభం సర్కిల్‌లో పని చేస్తున్న ఓ ఎస్సై మార్కాపురం సర్కిల్‌ లోని ఓ స్టేషన్‌కు వచ్చేందుకు గత కొద్దికాలం నుంచి

Published : 27 Sep 2022 02:08 IST

మార్కాపురం నేర విభాగం న్యూస్‌టుడే : పోస్టింగ్‌ కోసం ఓ పోలీసు అధికారి నేతను ప్రసన్నం చేసుకునేందుకు ఏకంగా రెస్టారెంట్‌నే కేంద్రంగా చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. సోమవారం మంత్రుల రాక నేపథ్యంలో బందోబస్తు నిమిత్తం మార్కాపురం సబ్‌ డివిజన్‌ నుంచి పలువురు ఎస్సైలు పట్టణానికి చేరుకున్నారు. వారిలో ప్రస్తుతం కంభం సర్కిల్‌లో పని చేస్తున్న ఓ ఎస్సై మార్కాపురం సర్కిల్‌ లోని ఓ స్టేషన్‌కు వచ్చేందుకు గత కొద్దికాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో స్థానికంగా పేరున్న ఓ చోటా నేతకు చెందిన రెస్టారెంట్‌లో దాదాపు రెండు గంటల పాటు మంతనాలు జరిపారు. పోలీసు అధికారిక జీపులో హాజరవడమే కాక యూనిఫాంతో ఎలాంటి జంకు లేకుండా రెండు గంటల పాటు మందు బాబులు ఉండే చోట విందు ఆరగిస్తూ మంతనాలు జరిపారు. ఎలాగైనా ఇక్కడికి రావాలని పట్టుబట్టిన ఆయన ఇటీవల వరసగా రావడంతోపాటు ప్రభుత్వ వాహనాన్ని రహదారిపై ఉంచి అధికారిక హోదాలో నేతను  ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని