ఏకధాటిగా కుదిపేసింది
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లాలోని తీరప్రాంత మండలాలను జడిపించాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు పడటంతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఒంగోలు నగరంలో ఇటీవల ఎన్నడూలేని విధంగా అత్యధిక వర్షపాతం నమోదైంది.
ఒంగోలు, తీరప్రాంత మండలాల్లో భారీ వర్షం
మద్దిపాడులో ఏకంగా 110 మి.మీ.
జిల్లా కేంద్రంలో వాహనదారులకు నరకం
ఈనాడు డిజిటల్, ఒంగోలు; న్యూస్టుడే, ఒంగోలు అర్బన్
ఒంగోలు డెయిరీ సమీపంలో వరద ప్రవాహంతో నిలిచిపోయిన వాహనాలు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లాలోని తీరప్రాంత మండలాలను జడిపించాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు పడటంతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఒంగోలు నగరంలో ఇటీవల ఎన్నడూలేని విధంగా అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో ప్రధాన రహదారులు మొదలు కాలనీల వరకు వాగులను తలపించాయి. కర్నూల్ రోడ్డయితే వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రవాహ ఉద్ధృతితో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాన నీటి పారుదలకు చేపట్టిన పనులు కొలిక్కిరాకపోవడం, ఆక్రమణలు వెరసి విపత్తుల వేళ ఒంగోలులో చేతులెత్తేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా శుక్రవారం నుంచి శనివారం రాత్రి వరకు పడిన వర్షాలతో ఒంగోలు, మద్దిపాడు, టంగుటూరు, సింగరాయకొండ ప్రాంతాలు వణికిపోయాయి. ఎటుచూసినా జల దిగ్బంధమే. ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, దుకాణాలలోకి నీళ్లు చేరి కార్లు, ద్విచక్రవాహనాలు మునిగాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగు, వాన నీరు ఏకమైపోయాయి. నగరంలో ప్రజలు రోజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కర్నూలు రోడ్డంతా వరదే. గుంటూరు రోడ్డుదీ అదే దుస్థితి. పోతురాజు కాలువకు ఇరువైపులా కాలనీలు జలంలో చిక్కుకున్నాయి. నాగులుప్పలపాడు మండంలోని కొత్తకోట వాగు పొంగి ప్రవహించడంతో వాహనాలు, ప్రజల రాకపోకలు గంటలకొద్దీ నిలిచాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం సాయంత్రం వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 14.1 మిల్లీమీటర్లు కాగా ఏకంగా 30 మి.మీ. నమోదైంది.
ఈ ఏడాదిలో అత్యధికంగా...
ఒంగోలు నగరంలో కురిసిన వర్షం ఈ ఏడాదిలోనే అత్యధికం. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8.30 వరకు 46.7 మి.మీ. పడగా శనివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 వరకు అత్యధికంగా 86.6 మి.మీ. కురిసింది. ఇక రాత్రి 10 గంటలకు పరిశీలిస్తే 108.75 మి.మీ. నమోదైంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటివరకు ఒంగోలు లోటు వర్షపాతంలోనే ఉండటం గమనార్హం. ఇక జిల్లాలో యర్రగొండపాలెం, పుల్లలచెరువు, పెద్దారవీడు, కురిచేడు, ముండ్లమూరు, దర్శి, అర్థవీడు, తాళ్లూరు, మద్దిపాడు, సంతనూతలపాడు, ఒంగోలు, పామూరు మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే 20- 55 మి.మీ. వర్షపాతం తక్కువే.
ఒంగోలులోని అద్దంకి బస్టాండు కూడలి వద్ద..
పెరిగిన నీటిమట్టం
వర్షాలకు మద్దిపాడులోని గుండ్లకమ్మ జలాశయంలో నీటిమట్టం పెరిగింది. దీని సామర్థ్యం 3.86 టీఎంసీలు కాగా గేట్ల మరమ్మతుల కారణంగా 1.7 టీఎంసీల వరకు నిల్వ ఉంచినప్పటికీ ప్రస్తుతం వస్తున్న వరదతో 1.85 టీఎంసీలకు చేరింది.
* రామతీర్థం జలాశయం నీటి సామర్థ్యం 1.57 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.17 టీఎంసీలు ఉంది.. మోపాడులో 1.49 టీఎంసీల నీరు కనిపించింది.
బాపూజీ కాంప్లెక్స్ సమీపంలో భారీ ప్రవాహం
కంట్రోల్ రూం.. టోల్ఫ్రీ 1077
ఒంగోలు గ్రామీణం: భారీ వర్షాల దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా సహాయక చర్యల నిమిత్తం ఒంగోలులోని కలెక్టరేట్లో కంట్రోలు రూం ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నం.1077ను అందుబాటులో ఉంచి.. 24 గంటలపాటు పనిచేసేలా సిబ్బందిని కేటాయించారు. కోస్తా తీర ప్రాంత మండలాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఒంగోలు నగరంలో తక్షణ సహాయ చర్యల నిమిత్తం డీఆర్వో ఓబులేసు...ఆర్డీవో విశ్వేశ్వరరావు, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
అమ్మో.. కర్నూలు రోడ్డు
ఎడతెరపిలేని వర్షంతో కర్నూల్ రోడ్డు చెరువును తలపించింది. ప్రతిభ కళాశాల, డెయిరీ సమీపంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పీర్లమాన్యం సమీపం నుంచి అటు పేర్నమిట్ట వరకు ఇదే పరిస్థితి. గంటల తరబడి వాహనాలు ఆగిపోయాయి. ఎక్కడికక్కడ లేఅవుట్లు వేసి ఆక్రమణలు, గోడల నిర్మాణాలు, చివరకు కాలువలనూ వదలకపోవడంతో నీరంతా ఈ ప్రధాన మార్గంపైకి చేరింది. ప్రతిభ కళాశాల ఎదురుగా ఉన్న వాగు ఆక్రమణల్లో ఉండటంతో ఎటు చూసినా జలమే. రహదారి విభాగినులను తొలగించి నీరు నిలవకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రాంతంలోని పలు సంస్థల్లో సైతం భారీ ఎత్తున ప్రవాహం నిలిచింది. పీర్లమాన్యం వద్ద బస్సులు కదలకపోవడంతో ఎక్కువ మంది నడుచుకుంటూ ఒంగోలు చేరుకున్నారు. ఇక్కడ సైతం డివైడర్లను తొలగించారు. 39వ డివిజన్లో సగం రోడ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
పీర్లమాన్యం సమీపంలో వరద పోయేందుకు విభాగిని తొలగింపు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.