ధర పెరగలేదు.. మీసం తిప్పలేదు
ప్రతికూల పరిస్థితులతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న రొయ్య రైతు .. ఇప్పుడు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్న పరిస్థితి. మార్కెట్లో రెండు వారాలుగా ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ప్రతి కౌంట్ మీద సరాసరిన కిలో రొయ్యల ధర రూ.50-60 చొప్పున పతనమైంది.
రెండు వారాల్లోనే కిలో వద్ద రూ.60 పతనం
ఆవేదనలో రొయ్య రైతులు
- న్యూస్టుడే, ఒంగోలు గ్రామీణ
ప్రతికూల పరిస్థితులతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న రొయ్య రైతు .. ఇప్పుడు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్న పరిస్థితి. మార్కెట్లో రెండు వారాలుగా ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ప్రతి కౌంట్ మీద సరాసరిన కిలో రొయ్యల ధర రూ.50-60 చొప్పున పతనమైంది. ఈ నెలలో ఎక్కువ విస్తీర్ణంలో పంట చేతికి రానుంది. అంతర్జాతీయంగా ఎగుమతులకు అనుమతి లేదన్న సాకుతో వ్యాపారులు సిండికేట్గా మారి తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ఎకరానికి రూ.లక్షపైగానే నష్టపోనున్నారు. రెండంకెల వృద్ధిలో భాగంగా ఆక్వా సాగు ద్వారా ప్రభుత్వానికి విదేశీ మారకద్రవ్యం రానుంది. ఈ నేపథ్యంలో స్థిరమైన మార్కెట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలోని ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, నాగులుప్పలపాడు, సింగరాయకొండ మండలాల్లో సుమారు 10 వేల మంది రైతులు 18 వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. 2020, 2021 సంవత్సరాల్లో కొవిడ్ ఆంక్షల వల్ల సరైన ఎగుమతులు లేక సాగుకు గిరాకీ తగ్గింది. అదే సమయంలో మేత ధరలు కూడా విడతల వారీగా కిలో రూ.20 పెరగడంతో సాగుదారులకు పెట్టుబడి వ్యయం పెరిగిపోయింది. రెండేళ్ల క్రితం కిలో ధర రూ.70 ఉండగా, ప్రస్తుతం రూ.90. మేతలో సోయా సగ భాగం, మిగతా సగభాగం మొక్కజొన్న, మిశ్రమ లవణాలు వినియోగిస్తారు. సోయా టన్ను రూ.90 వేలు పలుకుతోందని అప్పట్లో మేత తయారీ కంపెనీలు ధరల పెంచాయి. ప్రస్తుతం అది రూ.50 వేలు ఉంది. అయినా కంపెనీలు ధర తగ్గించడంలేదు. వంద రోజుల పంట కాలానికి ఎకరా చెరువుకు మూడు టన్నుల మేత వినియోగిస్తారు. ఒక్క మేత ధరల పెంపు వల్ల రూ.60 వేల పెట్టుబడి అదనపు భారంగా మారుతోంది.
సరాసరి ఇలా నష్టం..
రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా చెరువులకు ఇచ్చే విద్యుత్తు రాయితీలో కోత విధించడంతో పంట ఉత్పత్తికి కూలీ ఖర్చులతో సహా ఏటా పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. జూన్ నెల సీజన్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 8 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఎకరా చెరువుకు 1.50 లక్షల రొయ్య పిల్లలను వదిలిపెట్టారు. వాతావరణ పరిస్థితులతో ప్రకాశం జిల్లాలో ఎక్కువ శాతం 70, 80 కౌంట్ మీదనే పంట చేతికి వస్తోంది. అందుకు కిలో రొయ్యకు రూ.300 చొప్పున ఖర్చవుతోంది. మార్కెట్లో ప్రస్తుతం కిలో ధర రూ.250 నుంచి రూ.270 పలుకుతోంది. పెట్టుబడి రూపంలోనే సరాసరిన కిలోకు రూ.30-50 నష్టపోతున్నారు.
టంగుటూరు మండలం రావివారిపాలెం గ్రామం వద్ద రొయ్యల సాగు
మళ్లీ టైగర్ వైపు..
జిల్లాలో ఖాళీగా ఉన్న 10 వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు ఆక్వా సాగు చేపట్టాలి. పదిహేనేళ్లకు ముందు టైగర్ రొయ్యలు వేసేవారు. ఆ తర్వాత వనామీ వేశారు. ఇటీవల దాంట్లోనూ నష్టాలు రావడంతో టైగర్ వైపు చూస్తున్నారు. మార్కెట్ సంక్షోభంలో ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుత సీజన్లో రొయ్యల సాగుకు రైతులు అయోమయంలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ