త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం
అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు... ముందు వెళ్తున్న టిప్పర్ను ఢీకొన్న ఘటనలో 27 మందికి గాయాలయ్యాయి.
టిప్పర్ను ఢీకొన్న అయ్యప్ప భక్తుల బస్సు
27 మందికి స్వల్ప గాయాలు
టిప్పర్ను ఢీకొట్టడంతో నుజ్జయిన బస్సు ఎదుటి భాగం
ఒంగోలు నేర విభాగం, న్యూస్టుడే: అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు... ముందు వెళ్తున్న టిప్పర్ను ఢీకొన్న ఘటనలో 27 మందికి గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి వేళ ఒంగోలు నగర శివారులో ఈ సంఘటన చోటుచేసుకుంది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండంలంలోని డీఎల్ పురం, గునిపూడి గ్రామాలకు చెందిన ముప్పై మంది అయ్యప్ప భక్తులు, వారి కుటుంబీకులు మరో పది మంది కలిసి... ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (ఏపీ 16టీసీ 0022)లో శనివారం మధ్యాహ్నం శబరిమల బయలుదేరారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయానికి... ఒంగోలు నగర శివారులోని ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల వద్దకు చేరారు. బస్సు డ్రైవర్ కాపవరపు నాగరాజు నిద్రమత్తులో... ముందు వెళ్తున్న టిప్పర్ను వేగంగా ఢీ కొట్టారు. ఆ ధాటికి బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. పెద్ద శబ్ధం రావడంతో లోపలున్న వారంతా భీతిల్లి హాహాకారాలు చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఒంగోలు తాలూకా సీఐ వి.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బస్సులో ఉన్న భక్తులను బయటకు తీసుకొచ్చారు. ఈ సంఘటనలో ఐనపూడి అప్పలరాజు, అడగల అప్పలనాయుడు, బాజాల మంగ, పక్కుర్తి గణేష్, అల్లు నాగరత్నం, గిరిజాల కమలమ్మ, గిరిజాల అనసూయమ్మ, పురందాసు శ్రీను, గౌరీపట్నం కాంతం, గిరిజాల ధనుంజయ, గిరిజాల వెంకటలక్ష్మి, చొప్పా నాగేశ్వరరావు, కుక్కల శ్రీనివాసరావు, కె.జోగారావు, కురందాసు రమణ, గదుల ప్రసాద్, రాసారపు నరేష్, గిరిజాల కనకారావు, కొల్లి అప్పలకొండ, అమలకోట సూరిబాబు, వేమూరి రవికుమార్, గిరిజాల నూకాలమ్మ, మణికంఠ, డి.హరిప్రసాద్, జి.గోవింద్, జి.భవిష్యలతో పాటు డ్రైవర్ నాగరాజుకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. అందరికీ స్వల్ప గాయాలే కావడంతో ప్రథమ చికిత్స అనంతరం కొందరు స్వస్థలానికి తిరిగి వెళ్లిపోగా... మరికొందరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో శబరిమల వెళ్లారు. ఐనపూడి అప్పలరాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
క్షతగాత్రులను బస్సులో నుంచి కిందకు దించుతున్న దృశ్యం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న నేతల ఆగమనం.. ఒకేరోజు జగన్, లోకేష్, బాలకృష్ణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల తేదీ సమీపించే కొద్ది ప్రధాన పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై ప్రచారం జోరందుకోనుంది. -
రూ. 4.92 కోట్ల ఖర్చు.. రూ.2.21 కోట్ల జప్తు
[ 27-04-2024]
ఎన్నిల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2,21,90,514 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఓటర్లను ప్రభావితం చేసేలా పంచేందుకు సిద్ధం చేసినట్లుగా అనుమానిత వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హెచ్చరిక.. కండువాలు మారిస్తే జరిమానా
[ 27-04-2024]
ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. -
246మంది అభ్యర్థులు415నామినేషన్లు48తిరస్కరణలు
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. -
పేరుకే పోలీసులు..పుత్రరత్నం సేవలో బానిసలు
[ 27-04-2024]
పేరుకే పోలీసులు. నిత్యం వైకాపాకు వంతపాడుతుంటారు. ఆ నాయకులతో అంటకాగుతుంటారు.. అధికార పార్టీ నేతల సేవలో తరిస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. -
18,22,470 మంది చేతుల్లో భవిత
[ 27-04-2024]
మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల సవరణల ప్రక్రియ పూర్తయింది. -
తాడేపల్లి జలగ.. రక్త మాంసాలు పీల్చ
[ 27-04-2024]
అధికారంలోకి వస్తానే జగన్ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. -
పైసా విదిల్చింది లేదు
[ 27-04-2024]
గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది. -
తెదేపా పాలనలోనే అభివృద్ధి
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు.. ఆయన శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. -
కన్నీరే మిగిల్చావ్.. జగన్
[ 27-04-2024]
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. -
నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు
[ 27-04-2024]
రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. -
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.