logo

వీర జవాన్‌కు పీఎంవోవై అవార్డు

మండలంలోని గౌతవరం గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ వీరజవాన్‌కు గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా పీఎంఓవై అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Published : 27 Jan 2023 02:13 IST

సత్యప్రవీణ్‌కుమార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న డివిజనల్‌ కమాండెంట్‌ అధికారి, పోలీసులు

రాచర్ల, న్యూస్‌టుడే : మండలంలోని గౌతవరం గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ వీరజవాన్‌కు గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా పీఎంఓవై అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2018లో నక్సలైట్ల చేతిలో వీరమరణం పొందిన వీర జవాన్‌ చట్టి సత్యప్రవీణ్‌కుమార్‌ విగ్రహం వద్ద వారి తల్లిదండ్రులు ప్రసాద్‌, రంగలక్ష్మమ్మలకు సీఆర్‌పీఎఫ్‌ డివిజనల్‌ కమాండెంట్‌ అధికారి రవికుమార్‌ గురువారం ఈ అవార్డును అందజేశారు. వీర జవాన్‌కు రాచర్ల పోలీసులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు, బంధువులు నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని